India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు పర్యటించనుంది. డాక్టర్ కె. పొన్ను స్వామి, వినోద్ కుమార్ వంటి సభ్యులు కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో పర్యటిస్తారు. ఎం.బి. పూర్ బ్రిడ్జి, తిమ్మానగర్ రోడ్డు, రామాయంపేట, హవేలి ఘనపూర్ మండలాలతో పాటు ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అడుగు వేయడంతో గ్రామాల్లో రహస్య ప్రచారాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ తీసుకురావడంతో హైకోర్టు తీర్పు 8కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు కోసం పలువురు ఆశవహులు ఎదురు చూస్తున్నారు. తీర్పు అనంతరం ప్రచారాలు గ్రామాల్లో జోరు అందుకోనుంది. ఇప్పటికే గ్రామాల్లో కొందరు రహస్య ప్రచారం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది?
పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలో యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ రూరల్ సీఐ జార్జ్ తెలిపారు. వ్యాపార విభేదాల కారణంగానే ఆదివారం రాత్రి మహబూబ్ను హత్య చేశారని పేర్కొన్నారు. ఏడుపాయల బ్రిడ్జి వద్ద మహబూబ్పై ఉద్దేశపూర్వకంగా కర్ర విట్టల్, విటల్ భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేష్ దాడి చేయడంతో మృతి చెందినట్లు వివరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.
ఈనెల 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005, ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయి చట్టంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమైన చట్టం అమలులోకి వచ్చినందుకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరుల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ, NRSCకి చెందిన అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలతో సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్లో ఎన్నికల నియమాలపై అధికారులకు అవగాహన శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి అధికారి గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి శిక్షణ అందజేశారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు జిల్లాలో వదలడం లేదు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3 మిమీ, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS) ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6 చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZPHS, ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లాలో గత నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. డీఐఈఓ మాట్లాడుతూ.. కళాశాలలో పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్లకు ఆదేశించారు. విద్యార్థులు హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.