Medak

News August 26, 2025

మెదక్ జిల్లాకు వర్ష సూచన.. కలెక్టర్ అల్టర్

image

జిల్లాలో రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంతెనలు, వాగులు, చెరువులు, నీటి మునిగే ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించారు.

News August 25, 2025

మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

image

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2025

కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 24, 2025

MDK: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

చిన్నశంకరంపేటలోని మహాత్మా గాంధీ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంభాషించారు. ఒక ఉపాధ్యాయుడిలా తరగతి గదిలో వారికి పలు ప్రశ్నలు వేశారు. అనంతరం, భోజనాన్ని పరిశీలించి, వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తాజా కూరగాయలు వాడాలని, వంటగదిలో శుభ్రత పాటించాలని వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

News August 24, 2025

MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

image

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

News August 24, 2025

నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

image

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News August 24, 2025

‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

image

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!

News August 24, 2025

మెదక్: ‘వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

image

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ వైద్యాధికారి డా. శ్రీరామ్ అన్నారు. పాపన్నపేట PHCని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రోగులకు మందుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో చందర్, క్రాంతి, శారద తదితరులు పాల్గొన్నారు.

News August 24, 2025

మెదక్: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZP, మండల పరిషత్, మోడల్ స్కూల్, KGBV పాఠశాలల ప్రిన్సిపల్స్, HMలు, టీచర్లు అర్హులని చెప్పారు. HM/ప్రిన్సిపాల్ 15, ఇతర టీచర్లకు10 ఏళ్ల సర్వీస్ ఉండాలన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 30 లోపు DEO ఆఫీస్‌లో అందజేయాలన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబర్ 5న సత్కరించనున్నట్లు తెలిపారు.

News August 24, 2025

మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్

image

‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.