India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

మెదక్ జిల్లా కలెక్టరేట్లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలనునిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి అవసరమైన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కులగణన సంచాలకులు భారతి హోలికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు చేపట్టే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇవాళ రాత్రి 8 గంటల నుంచి మంజీరా బ్యారేజ్ నుంచి ఘనపూర్ ఆనికట్కు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. సెకనుకు 1,070 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.