India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్ కేసీ, ఇండస్ఇండ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలై, బైక్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.
HYD చుట్టూ RRR నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే భారత్ మాల-1లో ఉత్తర భాగం, భారత్ మాల-2ప్రాజెక్టులో దక్షిణ భాగం అభివృద్ధి చేయాలని భావించినా దక్షిణ భాగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రస్తుతం కేంద్రం తాజాగా విజన్-2047లో చేర్చినట్లుగా సమాచారం. దక్షిణభాగం ఆమనగల్, షాద్నగర్,చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉండనుంది.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సస్పెన్షన్లో ఉన్న కంది సీసీఎస్ ఇన్స్పెక్టర్ వెంకట కిషోర్ ఏసీబీకి చిక్కారు. రూ.5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ రియల్ఎస్టేట్ కాంట్రాక్టర్ను రూ.1.50 కోట్లు అడిగిన ఇన్స్పెక్టర్.. రూ.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. అయితే గతంలోనూ వెంకటకిషోర్కు రియల్ఎస్టేట్ రూ.10లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు అడగడంతో వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు.
పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, PM కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని MLA హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. HYDలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, PM కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం ఆగిపోయిందని, లక్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.
మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 136 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూములకు సంబంధించి 36, పెన్షన్లకు సంబంధించి 8, డబుల్ బెడ్ రూమ్లకు సంబంధించి 18, రుణమాఫీకి సంబంధించి 7, ఇతర సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాధన కోసం తాను సాగించిన పోరాటాలలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.
అల్లాదుర్గం మండలంలో విద్యుత్ షాక్తో లైన్మెన్ గణేశ్(24) మృతి చెందాడు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గణేశ్ రెడ్డిపల్లి, వెంకట్రావుపేటలో లైన్మెన్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అల్లాదుర్గం హెల్పర్ రామకృష్ణతో కలిసి స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వేసే క్రమంలో షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ఆల్టో కారు గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టి నాలుగు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చింది. కంకులు టోల్ ప్లాజా వద్ద కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూర్కు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయానికి 1270 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని ఏఈ మహిపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. సింగూరు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం 13.702 TMCల నీరు ఉంది. ప్రస్తుతం 391 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.