Medak

News April 6, 2025

మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

image

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య(39) నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య (39) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడపై నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

మెదక్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలని వేధించిన వ్యక్తిపై మెదక్ రూరల్ PSలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మెదక్ మండలానికి చెందిన విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో పదో తరగతి చివరి పరీక్ష రాసి స్వగ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఖాజిపల్లికి చెందిన అనిల్ కుమార్ తనను ప్రేమించాలంటూ వేధించాడు. అమ్మాయి తల్లి దండ్రులకు తెలపగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 5, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. దేవునిపల్లి గ్రామానికి చెందిన సాకేత్ (19) గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

మెదక్: చనిపోయిన జింకకు పోస్టుమార్టం.. అంత్యక్రియలు పూర్తి

image

రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.

News April 5, 2025

మత్తు పదర్థాలు, గంజాయి రూపుమాపాలి: ఎస్పీ

image

మాదక ద్రవ్యాలు, మత్తు పదర్థాలు, గంజాయిని పూర్తి స్థాయిలో రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.హుస్సేన్ పాల్గొన్నారు.

News April 5, 2025

MDK: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ VRO/ VRAలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16 లోపు గూగుల్ ఫామ్ (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7) నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయంగా సంతకం చేసిన కాపీని కలెక్టర్ కార్యాలయం(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో సమర్పించాలని అన్నారు.

News April 4, 2025

నిజాంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రహమాన్ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను ఎక్కించి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.

News April 4, 2025

తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

image

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.