Medak

News July 18, 2024

సంగారెడ్డి: EMT ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలో EMRI సంస్థ 108లో EMT ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు Bscనర్సింగ్, లైఫ్ సైన్స్, Bఫార్మా, GNM, DMLT కోర్సులు పూర్తిచేసి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలన్నారు.

News July 18, 2024

మెదక్ కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు.

News July 18, 2024

సిద్దిపేట: డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సీపీ

image

డీఎస్సీ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సందర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సీపీ బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి మధు ఉన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: నేడు లక్షలోపు రుణమాఫీ జగ్గారెడ్డి

image

రాష్ట్రంలో రైతులకు రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం గురువారం రుణమాఫీ చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో 7,528 మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రైతులు సా.4 గంటలకు నియోజకవర్గంలో సంబరాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేర్కొన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. CI నాగరాజు వివరాలు.. బీరంగూడలోని రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా రుణం వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 18, 2024

పటాన్‌చెరు: మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే: ఎమ్మెల్యే

image

ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీ పోయినట్టు కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అద్భుతమైన పాలన అందించిందన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: హాట్ టాపిక్‌గా మారిన హరీశ్ రావు TRS కండువా.!

image

పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

News July 17, 2024

సిద్దిపేట: దేశంలో ఇదే తొలిసారి: మంత్రి పొన్నం

image

దేశంలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని అన్నారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేస్తున్నామని తెలిపారు.

News July 17, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద రైతులపై దాడులు: హరీశ్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ధమక్కపల్లి కిష్టయ్యను పరామర్శించారు. కాంగ్రెస్ ఇష్ట రాజ్యాంగ పేద రైతుల భూముల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.

News July 17, 2024

రామచంద్రాపురం: మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన నేతలు

image

రామచంద్రాపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కృష్ణ కాంత్, పఠాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువతో సన్మానించి బొకే అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్ చారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.