Medak

News July 16, 2024

పటాన్‌చెరు: కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ.40 వేలు మాయం

image

ప్రైవేటు కొరియర్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ.40వేలు మాయమైన ఘటన అమీన్‌పూర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆదివారం DTDC అనే కొరియర్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. లింకు పంపుతున్నాను దానిలో రూ.5వేలు పంపండి కొరియర్ చేరుతుందని కస్టమర్ కేర్ ఉద్యోగి చెప్పగా డబ్బులు పంపాడు. వెంటనే ఖాతాలోని రూ.40వేలు డ్రా అయ్యాయి.

News July 16, 2024

నాగల్‌గిద్ద మండలంలో మూతపడ్డ పాఠశాలలు !

image

నాగల్‌గిద్ద మండలంలోని రేఖానాయక్ తండా, చోక్లా తండా, శాంతినగర్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో మరో చోటుకి వెళ్లారు. ఈ పాఠశాలలు దూర ప్రాంతంలో ఉండడంతో ఇక్కడికి రావడానికి టీచర్లు సుముకత చూపట్లేదు. దీంతో పిల్లలకు తమ వెంట పనులకు తీసుకెళ్లగా, మరికొందరు ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి స్కూళ్లు తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 16, 2024

మెదక్ జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు !

image

ఉమ్మడి జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ ఏరియా దవాఖాన, తూప్రాన్‌, రామాయంపేట, కౌడిపల్లి పీహెచ్‌సీల్లో రోగులు బారులుతీరుతున్నారు. జూన్‌లో కౌడిపల్లి పీహెచ్సీలో 148 మంది జ్వరంతో బాధపడుతున్న వారికి చికిత్సలు చేయగా, జూలైలో 57 మంది టైఫాయిడ్‌ బాధితులకు వైద్యం అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

News July 16, 2024

మెతుకు సీమ రైతులకు GOOD NEWS

image

ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులకు కాంగ్రెస్ తీపికబురు చెప్పింది. ఆగస్టు 15 లోగా రూ. 2లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఈమేరకు మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా నుంచి 2023-24లో 1,75,832 మంది రైతులకు రూ.1,299 కోట్ల మేరకు పంట రుణాలు పంపిణీ చేశారు. ఇందులో లక్ష మందికి పైగా రైతులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారు ఉంటారని సమాచారం.

News July 16, 2024

నంగునూరు: సూక్ష్మరాతి పనిముట్లు లభ్యం

image

నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పరిశోధనలు చేస్తున్న ఆయన కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్ళు,శాతవాహనుల కాలం నాటి  టెర్రకోట బొమ్మలు,పూసలు,దేవత విగ్రహలు ఎన్నో గుర్తించాడు.ఇప్పుడు కొత్తగా గ్రామానికి దక్షిణం వైపున ఉన్న జోకిరమ్మ బండ మీద సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథిక్ టూల్స్) గుర్తించాడు.

News July 16, 2024

సిద్దిపేట: ‘జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి’

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి కవిత తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు tsstudycircle. Co.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News July 16, 2024

మెదక్ పాలిటిక్స్: నాడు ప్రత్యర్థులు.. సహచరులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించని స్థాయిలో మార్పుచెందాయి. గత అసెంబ్లీ ఎలక్షన్‌లో పటాన్‌చెరు నుంచి పోటీ చేసిన నీలం మధు, ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా MP ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా గెలిచిన సురేశ్ కుమార్ శెట్కార్(INC), BRS నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికతో నాటి ఈ నలుగురు ప్రత్యర్థులు నేడు సహచరులయ్యారు.

News July 16, 2024

మెదక్: అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆర్టీసీ, విద్య, డిఆర్డిఓ, ఆరోగ్య, పంచాయతీ, వ్యవసాయ, పౌరసరఫరా, అటవీశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించారు. పలు విషయాలు అధికారులను నుండి అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 15, 2024

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఘటనపై హరీశ్ రావు ఫైర్

image

చిక్కడపల్లి <<13635887>>సెంట్రల్ లైబ్రరీ<<>> వద్ద నిరుద్యోగుల ఆందోళన, పోలీసుల చర్యలపై MLA హరీశ్ రావు స్పందించారు. ‘గ్రూప్స్, DSC అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.

News July 15, 2024

మెదక్: పోస్టాఫీసులో 87 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. మెదక్ డివిజన్‌లో 42, సంగారెడ్డి డివిజన్‌లో 45 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT