Medak

News July 9, 2024

రాంచంద్రంపురం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ మార్క్స్ నగర్‌లో ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్(40) సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. అతను గంజాయికి బానిసై ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.27,500 విలువ గల 1,100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం పోలీసులు తెలిపారు.

News July 9, 2024

మెదక్ జిల్లాకు 15 మంది ఎంఈవోలు కావలెను!?

image

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని ‌ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులపై MEOల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో PS-607, హైస్కూల్స్-124, ZPHSలు-140 ఉన్నాయి. అయితే జిల్లాలో 21 మండలాలుండగా.. కొన్ని మండలాలకు సీనియర్‌ HMలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, 15 MEO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News July 9, 2024

దుబ్బాక: కూతురు ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

image

కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దుబ్బాక మండలంలో జరిగింది. SI గంగరాజ్ వివరాలు.. అచ్చుమాయిపల్లికి చెందిన సోమారపు లింగం పొలానికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News July 9, 2024

దుబ్బాక: కూతురు ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

image

కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దుబ్బాక మండలంలో జరిగింది. SI గంగరాజ్ వివరాలు.. అచ్చుమాయిపల్లికి చెందిన సోమారపు లింగం పొలానికి వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫొన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. కూతురు ప్రేమ వివాహంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News July 9, 2024

సంగారెడ్డి: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని సంగారెడ్డి నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉపేందర్ మంగళవారం తెలిపారు. ఆసక్తి గలవారు www.tgsrtconline.in వెబ్ సైట్‌లో రిజర్వేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 19న సంగారెడ్డి నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 9, 2024

సిద్దిపేట: ‘ప్రతి ఇంటి నుంచి ఇన్నోవేటర్ తయారు కావాలి’

image

ప్రతి ఇంటి నుంచి ఒక ఇన్నోవేటర్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలకు సిద్దిపేట జిల్లా వేదికగా నిలవాలని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. వారితో ఆర్డీవో సదానందం, ఈడీఎం ఆనంద్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి ఉన్నారు.

News July 9, 2024

MDK: ఇంటింటా ఇన్నోవేటర్-24కు దరఖాస్తులు ఆహ్వానం

image

మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే కొత్తరకం ఆవిష్కరణల కొరకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మ డి మెదక్ జిల్లా నుంచి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేలా రూపొందించిన ప్రాజెక్టుకు సంబంధించి 2 నిమిషాల నిడివిగల వీడియో, ఫోటోలతో పాటు తమ వ్యక్తిగత వివరాలను ఆగస్టు 3లోపు 9100678543 నంబరుకు పంపాలన్నారు. ఆసక్తి గలవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

News July 8, 2024

సంగారెడ్డి: మల్లేశ్వరి ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

image

రాయికోడ్ గురుకుల పాఠశాల భవనం పై నుంచి కిందపడిన విద్యార్థిని మల్లీశ్వరి గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం విచారణకు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ పాఠశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. గాయపడిన విద్యార్థిని మల్లీశ్వరికి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News July 8, 2024

ఖేడ్ నుంచి అరుణాచలం ప్రత్యేక బస్సులు

image

గురుపౌర్ణమి సందర్భంగా నారాయణఖేడ్ ఆర్టీసీ నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నట్లు మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. 19న సాయంత్రం బయలుదేరి 20వ చేరుకుంటుంది. 21న గురుపూర్ణమి దర్శనం చేసుకోవచ్చని అన్నారు. బస్ టికెట్ ధర రూ.4300, దర్శనం, భోజనం ప్రయాణికులు ఎవరి వారు చూసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం డిపోలో సంప్రదించాలన్నారు.

News July 8, 2024

సంగారెడ్డి: బీజేపీ గేమ్‌లో కేసీఆర్ 4వ స్తంభం: జగ్గారెడ్డి

image

బీజేపీ గేమ్‌లో కేసీఆర్ నాలుగవ స్తంభమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తెలివిగా గేమ్ మొదలు పెట్టిందని, మొదట టీడీపీని దింపి, సపోర్ట్‌గా జనసేనతో ముందుకు వెళ్లనుందన్నారు. వీరికి బీఆర్ఎస్ జత కలిసే అవకాశం ఉందన్నారు. విభజన సమస్యల పేరిట చంద్రబాబు తెలంగాణలో చాలా తెలివిగా అడుగు పెట్టారని దుయ్యబట్టారు.