India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం గం.8:30 AMవరకు నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, కోహిర్ 13.6 డిగ్రీలు, చోటకుర్, పుల్కల్ 14.0, నాల్కల్ 14.4, మెదక్ జిల్లాలో వెల్దుర్తి 14.6, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గ్ 15.2, టేక్మాల్ 15.4, రేగోడ్ 15.5, సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి 15.2, దుబ్బాక 15.3, మిర్దొడ్డి 15.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం వల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎంపీ స్వామి వివేకానందకు నివాళులర్పించారు. లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు ఆగకండి.. అంటూ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద మహోన్నతమైన సందేశం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందరన్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీని అదనుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం గం.8.30 AM వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్, కల్హేర్ 15.6, జహీరాబాద్, ఆందోల్, కోహిర్ 15.9, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట్ 16.2, మనోహరాబాద్ 16.7, రేగోడ్ 16.8, తూప్రాన్ 16.9, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక 16.0, మార్కూక్ 16.2, ములుగు 16.3, మద్దూరు 16.5 °C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డిలోని మిలాద్ మైదానంలో సమీర్(27) యువకుడు శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమీర్ను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. రిక్షా కాలనీకి చెందిన సమీర్ గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పట్టణ సీఐ రమేష్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఐదుగురు యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం డ్యామ్లో దిగారు. ఇందులో ఇద్దరు యువకులు బయటపడగా మరో ఐదుగురు యువకులు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, అందోల్ 14.3, చౌటాకూర్, కోహిర్ 14.5, మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట 15.0, టేక్మాల్ 15.1, నిజాంపేట్ 15.6, సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ 14.6, దూల్మిట్ట 15.0 C ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే రోజులలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అహ్మద్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందని కార్యక్రమానికి జిల్లాలో ఉన్న వివిధ రాజకీయ ప్రతినిధులు, వివిధ సంఘలా సభ్యులు పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.