India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సాపూర్కు చెందిన మోరే రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో నిర్వహించిన ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్గా ఏర్పడిన నాయకులు నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాణిక్య ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా జ్యోతి, కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిద్దిపేట ఫుట్ బాల్ మైదానంలో ఈనెల 15 నుంచి 29 వరకు జాతీయ జూనియర్ బాలికల ఫుట్ బాల్ శిబిరం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. శిబిరంలో ఎంపికైన వారికి కర్ణాటకలోని బెళగావిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మెదక్ జిల్లా హావేలిఘనపూర్ SI ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు రూ.50వేలు డిమాండ్ చేసినట్ల తెలిసింది. ఈ క్రమంలో రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు పోలీస్ స్టేషన్లో సోదాలు చేస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్కు గురయ్యారు.
కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
సంగారెడ్డి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతి పాఠశాలకు పంపే ప్రత్యెక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 15 చివరి తేదని తెలిపారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆయా అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తులతో హాజరయ్యారు
సరైన వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీటి జాడ కరువైంది. మెదక్ జిల్లాలో జలాశయాల్లో నీరు లేకపోవడంతో పంటల సాగు చేపట్టిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిసారి ఆషాడమాసం వచ్చేసరికి రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులు అన్ని పూర్తి చేసేవారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూ పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించుకునేవారు. కానీ ఈసారి ఆషాడమాసం పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు.
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులపై MEOల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో PS-607, హైస్కూల్స్-124, ZPHSలు-140 ఉన్నాయి. అయితే జిల్లాలో 21 మండలాలుండగా.. కొన్ని మండలాలకు సీనియర్ HMలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, 15 MEO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా రాయికోడు మండల పరిధిలోని అల్లాపూర్ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి కిందపడింది. కాగా, సదరు విద్యార్థినిని 10వ తరగతి చదువుతున్న మల్లీశ్వరిగా గుర్తించారు. విద్యార్థినికి తీవ్రగాయాలు కావండంతో స్థానిక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.