Medak

News December 30, 2024

SDPT: నేటి కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు

image

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రెండో రోజు సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 వరకు లక్ష బిల్వార్చన, మహామంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News December 30, 2024

సంగారెడ్డి: LOVE FAILURE.. యువతి సూసైడ్

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్ర నగర్ చెందిన ఓ యువతి(22) ప్రేమ విఫలం కావడంతో ఒక ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 30, 2024

కొల్చారం: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. ముగ్గురిపై కేసు

image

అక్రమ సంబంధం అంటగట్టి బెదిరింపులకు పాల్పడడంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. నర్సాపూర్ చెందిన ఓ టిఫిన్ సెంటర్ యజమాని దివ్య హెడ్ కానిస్టేబుల్‌తో ఫోన్లో మాట్లాడింది. ఇది గమనించిన ఆమె భర్త, అల్లుడు చంపుతామని బెదిరించారు. దీంతో సాయి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

News December 29, 2024

మెదక్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో ఆదివారం ఉ.గం.8.30 వరకు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. చిలప్ చెడ్ 16.3, టేక్మాల్, కౌడిపల్లి 16.8, టేక్మాల్ 17.0, వెల్దుర్తి 17.1, కుల్చారం, పాపన్నపేట, పెద్దశంకరంపేట 17.4, అల్లాదుర్గ్ 17.5, శివ్వంపేట్ 17.6, మనోహరాబాద్, నార్సింగి 18.0, నర్సాపూర్ 18.1, చేగుంట 18.2, తూప్రాన్ 18.3, రామాయంపేట 18.4, రేగోడ్ 18.6, మెదక్, హవేళిఘనపూర్ 18.9, చిన్న శంకరంపేట19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.

News December 29, 2024

రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థులకు శాపంగా: హరీష్ రావు

image

విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.

News December 29, 2024

మెదక్: ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’

image

మెదక్ మం. జానకంపల్లికి చెందిన మల్లయ్య కుమార్తె శ్రావణి(17) మెదక్ కస్తూర్బా పాఠశాలలో టెన్త్ చదువుతుంది. ఈనెల 22న బోనాల పండుగకు ఇంటికొచ్చిన శ్రావణి శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’ అని లేటర్ రాసి ఉరేసుకుంది. తన చెల్లి మృతికి కారణమైన తండ్రి మల్లయ్య, పినతల్లిపై చర్యలు తీసుకోవాలని స్రవంతి, ఆకృతి ఫిర్యాదు చేశారు. మల్లయ్య మొదటి భార్య చనిపోగా జ్యోతిని 2వ పెళ్లి చేసుకున్నాడు.

News December 29, 2024

నాలుగో విడత రుణమాఫీకి రైతుల ఎదురుచూపులు

image

ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.

News December 29, 2024

మెదక్: అనారోగ్యంతో భార్య ఆస్పత్రికి.. భర్త సూసైడ్

image

శివంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామంలో భార్య అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన గున్నాల అశోక్ గౌడ్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శ్యామల అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లడంతో ఇంటివద్ద ఒంటరిగా ఉన్న అశోక్ గౌడ్.. శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2024

నాలుగో విడత రుణమాఫీకి రైతుల ఎదురుచూపులు

image

ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.

News December 29, 2024

2024 రౌండప్.. మెదక్‌లో బీఆర్ఎస్‌కు దెబ్బ !

image

సార్వత్రిక ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BRS కంచుకోటను పదుల పరుచుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాల్లో BRS విజయం సాధించినప్పటికీ అధికారం కాంగ్రెస్ హస్తగతం అయింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు చేరుతారని ప్రచారం ఉంది. ఉమ్మడి జిల్లాలో సత్తా చాటినప్పటికీ BRSకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. COMMENT

error: Content is protected !!