India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమీన్పూర్ PSపరిధిలో <<15078851>>దంపతులు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. క్షణికావేశం, అనాలోచిత నిర్ణయంలో పిల్లలు అనాథలయ్యారు. సందీప్, కీర్తికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప బర్త్డే విషయంలో ఇద్దరికి గొడవైనట్లు తెలిసింది. బయటకు వెళ్లిన సందీప్ తిరిగి వచ్చేసరికి కీర్తి సీలింగ్కు ఊరేసుకుంది. కీర్తిని కిందకు దింపిన సందీప్.. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడే ఉరేసుకున్నాడు. కేసు నమోదైంది.
భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలు, సూచనల ప్రకారం ప్రత్యేక సవరణ-2025లో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో తుది ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం విడుదల చేశారు. 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 1,04,917 మంది పురుషులు, 1,15,987 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్లు కలిపి మొత్తం 2,20,908 సాధారణ ఓటర్లు ఉన్నారు.
యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిన్నకోడూరు వాసి చెందిన నిఖిల్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి 2 సార్లు గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ఆమె నగ్నచిత్రాలు ఉన్నాయని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. నిఖిల్కు మరో యువతితో నిశ్చితార్థం అవ్వడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 18 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
ఈ నెల రెండో వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో రేగోడ్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో ఎన్నికల హడావిడి ఊపందుకొనుంది. సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల గుర్తులను ముద్రణ చేసేందుకు సిద్ధమయ్యారు.
మెదక్ జిల్లా మసాయిపేట మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో బాలిక అన్నయ్య, బాబాయ్ వారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అదునుగా తీసుకున్న ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దిరపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఓ మహిళను నమ్మించి సహజీవనం చేస్తూ చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రామకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. బిహార్కు చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీకి రజిని దేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారు కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు. ఈక్రమంలో వారి మద్య డబ్బుల విషయంలో తరచూ గొడవ జరగుతుండగా, రజినిని చంపినట్టు ఎస్ఐ తెలిపారు.
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజతో తలెత్తే అనార్థాలపై అందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.