India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బతిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి R&B అధికారులను ఆదేశించారు. సోమవారం CM రేవంత్ రెడ్డి HYD నుంచి వర్షాలు, వరద నష్టాలపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు R&B రహదారులు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 54 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్, వాక్సినేషన్, భర్త కంట్రోల్ తదితర అంశాలపై ప్రజలకు, విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల సంబంధిత అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుక్కలన్నింటికీ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు అందాయని, వాటిలో 30 జిల్లా అధికారులకు, 69 రెవెన్యూ శాఖకు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. తద్వారా ఈ సమాచారం వారి కుటుంబాలకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లాలో పోలింగ్ కేంద్రాలు వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నత అధికారులకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కలెక్టర్ ఆమోదంతో పోలింగ్ స్టేషన్లో తుది జాబితాను ఎంపీడీవోలు ప్రచురించనున్నారు.
NLG జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలో 4 రోజుల క్రితం జరిగిన ఓ మర్డర్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. పగటిపూట ఎక్కడో ఒకచోట సంచరిస్తూ సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్టాండ్, సర్కారు దవాఖాన, అన్నపూర్ణ క్యాంటీన్లలో తిష్ట వేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేసి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పీరియడ్ అటకెక్కింది. అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పీఈటీలు, మైదానాలు నిధుల కొరత వెక్కిరిస్తుంది. జిల్లాలో మెజారిటీ పీఈటీలు కాలక్షేపానికి, ఇతర విధులకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు క్రీడా కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓలు కార్యాలయాలకే పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డుకుని ఎండబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో మాట్లాడతామని స్పష్టం చేశారు. కవిత ‘లిల్లీపుట్’ వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డి పరువు తీసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.