Nalgonda

News May 7, 2025

మ్యుటేషన్‌తో వివాదాలకు చెక్: నల్గొండ కలెక్టర్

image

భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భూములు సర్వే చేసిన తర్వాత మ్యుటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు.

News May 7, 2025

జిల్లాలో ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20న ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 24న మిర్యాలగూడలోని ఒక పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

NLG: పనితీరు ఆధారంగా అంగన్వాడీలకు ఇక గ్రేడింగ్!

image

 NLGజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నారు.

News May 7, 2025

NLG జిల్లాలో ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20-25 ఏళ్ల యువతను పట్టిపీడిస్తోందంటున్నారు.

News May 7, 2025

NLG: పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు.

News May 7, 2025

నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

image

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.

News May 7, 2025

సూర్యాపేట: రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

image

మునగాల మండలం ఆకుపాముల వద్ద శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడకు బైకుపై అన్నా చెల్లెలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ అకుపాముల వద్ద
గేదె అడ్డురావటంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైకు వెనకాల కూర్చున్న ఆమె రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.

News May 7, 2025

FLASH: బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి

image

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికలు తెలిపిన వివరాలు.. మునుగోడు మండలం ఊకోండి శివారులో బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

NLG: వచ్చేనెల 3 వరకు పింఛన్ల పంపిణీ

image

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పింఛన్లు నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పింఛనుదారులు గమనించి పోస్టాఫీసుల ద్వారా తమ పింఛన్లను పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా పింఛన్ పొందాలని సూచించారు.

News April 25, 2025

నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

image

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.