Nalgonda

News December 2, 2025

నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోని గ్రామాలు!

image

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్‌పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.

News December 2, 2025

నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

image

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.

News December 2, 2025

నల్గొండ: రేపు మూడో విడత నోటిఫికేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే NLG, CDR డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

News December 1, 2025

చండూర్: ఏకగ్రీవాల పేరుతో ఓటు హక్కు దోపిడీ: రఫీ

image

చండూర్ మండల బంగారిగడ్డ పంచాయతీ రిజర్వేషన్‌ను అగ్రకుల పెత్తందారులు తమ అనుచరులతో దుర్వినియోగం చేస్తున్నారని సమాజ్ వాదీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రఫీ సోమవారం నల్గొండలో ఆరోపించారు. స్థానిక ఎన్నికలను డబ్బు ప్రలోభాలతో ఏకగ్రీవం పేరుతో హరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటు హక్కు హరించబడుతోందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలను చట్టపరంగా అడ్డుకుంటామని అన్నారు.

News December 1, 2025

నల్గొండ జిల్లాలో నేటి నుంచి కొత్త వైన్సులు!

image

జిల్లాలో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకాల పరిమితితో 154 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాపులకు గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే 154 వైన్స్‌ల లైసెన్స్ పొందిన వారు షాపులు తెరిచేందుకు అనుమతి పొందారు. కొత్తగా దుకాణాలు తెరిచే వ్యాపారులు ఇప్పటికే మద్యాన్ని డంపింగ్ చేసుకున్నారు.

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.

News December 1, 2025

బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

image

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

News November 30, 2025

నల్గొండ: గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ..!

image

నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించే లక్ష్యంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కొన్ని సర్పంచ్ స్థానాల్లో ‘స్నేహపూర్వక పోటీ’కి తెరతీశాయన్న చర్చ నడుస్తోంది. నల్గొండ, తిప్పర్తి మండలంలో ఈ పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఈ పార్టీల తీరు ‘గల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ’ అన్న చందంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.