India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 60,221 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 168 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించారు. ఈ ప్రక్రియ ద్వారా 7,077 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 444 కొనుగోలు కేంద్రాలకు గాను, ప్రస్తుతం 373 కేంద్రాలు పనిచేస్తున్నాయి.

సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేకపోతున్నానంటూ చందంపేట మండలం గుంటిపల్లి పంచాయతీ కార్మికుడు నల్ల దేవరాజు శుక్రవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కొడుకు అనధికారికంగా పెత్తనం చలాయిస్తూ, తాను విధులకు హాజరవుతున్నా గైర్హాజరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గత ఆరు నెలలుగా జీతం రాకుండా అడ్డుపడుతున్నారని, వెంటనే విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కార్మికుడు వేడుకున్నారు.

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.

హైదరాబాద్-సాగర్ రహదారిపై కారు, లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్కు చెందిన గిరిధర్ గౌడ్ మల్లెపల్లి నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్న క్రమంలో పోలేపల్లి(రాంనగర్) వద్ద లారీ ఢీకొనడంతో కారులో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి అవినాష్కు తీవ్రగాయాలు అవ్వడంతో మాల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.
Sorry, no posts matched your criteria.