Nalgonda

News November 3, 2024

NLG: కానిస్టేబుల్‌ను బలి తీసుకున్న ఆర్థిక సమస్యలు

image

ఆర్థిక సమస్యలే కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నాయి. నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కటుకూరి రవిశంకర్ (42) నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్‌మెంట్‌లో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వెంకటమ్మ నల్గొండ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

News November 3, 2024

NLG: గుండ్లపల్లి కాలువ వద్ద దామోదర్ మృతదేహం లభ్యం

image

కనగల్ మండలం షాబ్దుల్లాపురం కాలువలో <<14512610>>తండ్రి, కొడుకులు గల్లంతు<<>> కాగా నేడు ఉదయం సురవరం దామోదర్ మృతదేహం లభ్యమైంది. నల్లగొండ పరిధిలోని గుండ్లపల్లి వద్ద కాలువలో నేడు ఉదయం తండ్రి అయిన దామోదర్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుమారుడు ఫణింద్ర వర్మ ఆచూకీ ఇంకా లభించ లేదు.

News November 3, 2024

సమగ్ర సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

ఈ నెల 6 నుండి నిర్వహించనున్న సామాజిక ,ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విషయమై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 2, 2024

పంచారామ దర్శనం కోసం ప్రత్యేక బస్సులు: ఆర్ఎం రాజశేఖర్

image

కార్తీక మాసంలో ఒకే రోజు పంచారామ దర్శనం కోసం నల్గొండ రీజినల్ నుండి అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్ లు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దర్శనం ఉంటుందన్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు అన్ని డిపో స్టేషన్ ల నుండి నవంబర్ 3,10,17,24 తేదీలలో బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

News November 2, 2024

NLG: తండ్రీకొడుకుల గల్లంతు

image

కనగల్ మండలంలోని శాబ్దల్లాపురం గ్రామ సమీపంలో ఏఎంఆర్పీ కాలువలో ఈతకు వెళ్లి తండ్రీకొడుకు గల్లంతయ్యారు. వారు సూరవరం దామోదర్, అతని కుమారుడు బిట్టుగా తెలుస్తోంది. వీరి ఆచూకీ కోసం కనగల్ ఎస్ఐ పి.విష్ణు, పోలీస్ సిబ్బంది, స్థానికులు గాలిస్తున్నారు.

News November 2, 2024

నల్లగొండ: అంగన్వాడీ పోస్టులపై ఆశలు 

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ల, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 162 టీచర్ల, 595 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయుటకు ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలున్న గ్రామాల్లో స్థానిక మహిళలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

News November 2, 2024

సాగర్ అభివృద్ధికి చర్యలు : మంత్రి జూపల్లి

image

నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం అయన బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి.పాటిల్ తో కలిసి పరిశీలించారు. సాగర్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News November 1, 2024

కోదాడ: నీ డీపీ బాగుంది.. ఉద్యోగినికి లైంగిక వేధింపులు

image

కోదాడలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసింది. బాధిత మహిళ వివరాలిలా.. ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను ఓ రాజకీయ నాయకుడి పీఏ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘డీపీ బాగుంది.. వస్తావా’ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఎంతైనా ఇస్తా లొంగి పోవాలంటూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు వాపోయింది. నిందితుడిపై షీ టీం, సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. 

News November 1, 2024

సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ (32) సాగర్ ఎడమ కాలువలో పడి మృతి చెందాడు. గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన హరికృష్ణ కాలువలో విగతజీవిగా పడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో హరికృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News November 1, 2024

యాదాద్రి: చేపల వేటకెళ్లి గల్లంతు.. మృతదేహం లభ్యం 

image

వలిగొండ మూసీలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. కిరణ్ అనే బాలుడి మృతదేహం నిన్న లభ్యం కాగా.. జీవన్ అనే బాలుడి మృతదేహం ఇవాళ దొరికింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు మృతిచెందడంతో వారి ఇరువురి కుటుంబాలు తీవ్ర శోకతప్త హృదయంతో మునిగిపోయాయి.