India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇకపై బియ్యంతో పాటు పర్యావరణహిత సంచులను అందించనుంది. జిల్లాలోని 4.66 లక్షల కార్డులకు ఈ సంచులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల బియ్యం కోటాతో పాటు వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. కార్డుల వారీగా సంచులను ఎమ్ఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ బ్యాగుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యమైన సంచులను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం 143.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 15.4మి.మీ. వర్షం కురివగా నార్కట్ పల్లిలో 12.1, కట్టంగూర్ 10.4, శాలిగౌరారం 11.5, నకిరేకల్ 14.2, కేతేపల్లి10.9, తిప్పర్తి 4.4, నల్గొండ 6.3, కనగల్ 4.1, అనుముల 2.6, నిడమనూరు 1.1, త్రిపురారం 2.3, వేముల పల్లి 3.3, మిర్యాలగూడ 1.3, తిరుమలగిరి1.7, పెద్ద వూర 1.4, చింతపల్లి 3.2, గుర్రంపోడు లో 3.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాహనాల వేగాన్ని నియంత్రించడం, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వాతావరణంలో వచ్చిన మార్పులతో పట్టణాలతో పాటు గ్రామాల్లో వైరల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. రోగులతో NLG ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం కిటకిటలాడుతోంది. ఇక్కడ నిత్యం 500లకు పైగా ఓపీలు నమోదు అవుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమల ఉద్ధృతి కారణంగా టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
శాలిగౌరారం(M) ఇటుకులపహాడ్కి సదరం క్యాంపు వైద్యులు నేడు రానున్నారు. ఇటీవల Way2Newsలో ‘వారు అడగలేరు.. ప్రభుత్వమే ఇస్తే బాగు’ శీర్షికన కథనం వచ్చిన సంగతి విషయం తెలిసిందే. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ప్రత్యేక స్లాట్ బుక్ చేసిన వైద్యులు మూగవారు జిల్లోజు పూలమ్మ, జిల్లోజు రాములును పరీక్షించనున్నారు. దీంతో గ్రామస్థులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. గ్రామాలలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, ప్రణాళిక ప్రకారం యూరియా అందిస్తున్నామన్నారు. సోమవారం మంత్రి తుమ్మల, సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా లభ్యత, పంపిణీ గురించి వివరించారు.
Sorry, no posts matched your criteria.