Nalgonda

News September 5, 2024

NLG: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

భువనగిరి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పీఈటీ వీరేశం

image

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్పూర్ గ్రామంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న వీరేశంకు ఉపాధ్యాయ జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలల 2024 అవార్డులను ప్రకటించారు. జిల్లాలోని 25 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రభుత్వం ఎంపిక చేశారు.

News September 5, 2024

నల్గొండ: పెరిగిన ఉల్లి ధరలు

image

మార్కెట్‌‌లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు వణికి పోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర ఇప్పడు ఘాటెక్కింది. వారం రోజుల్లోనే ఉల్లి ధరలు 30-50 శాతం వరకు పెంచారు. ఉమ్మడి జిల్లాలో హోల్సేల్ మార్కెట్లలో తెల్ల ఉల్లిగడ్డల ధర రూ.కిలో 70, ఎర్ర ఉల్లిగడ్డలు కిలో రూ.60కు చేరుకున్నాయి. రిటైల్ వ్యాపారులు వాటికి అదనంగా రూ.10 పెంచి విక్రయిస్తున్నారు.

News September 5, 2024

నేడు నల్గొండకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

image

BJP సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించనున్న సంస్మరణ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి రానున్నారు. నల్గొండ నుంచి ఎంపీగా పలుమార్లు పోటీ చేసిన ఆయన గవర్నర్ హోదాలో రానుండటంతో జిల్లా BJP అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 5, 2024

NLG: జిల్లాలో ఉత్తమ గురువులు@130 మంది

image

జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 130 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి ఉత్తమ గురువులుగా ఎంపిక చేసింది. ఉత్తమ బోధనతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలిచినందుకు వీరు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించనున్నారు.

News September 5, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 586.70 అడుగులు (303.9495 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి 1,83,563 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుదుత్పత్తికి 29,557 క్యూసెక్కులు, కుడికాల్వకు 7,578 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 5, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 130 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 130 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నల్లగొండ జిల్లాలోని వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోగా మండల కమిటీ పలు ఉపాధ్యాయుల పేర్లను సూచిస్తూ జిల్లా అధికారులకు నివేదిక పంపించింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకోనున్నారు.

News September 4, 2024

చెర్వుగట్టుపై వ్యక్తి మృతి

image

నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక సత్యనారాయణ స్వామి మండపం ముందు విగతజీవిగా ఉన్నాడు. చెర్వుగట్టు దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి నార్కట్ పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 4, 2024

బెల్టుషాపులు నిర్మూలించిన గ్రామాలపై శ్రద్ద: MLA రాజగోపాల్ రెడ్డి

image

మునుగోడు మండలములో బెల్టు షాపులు నిర్మూలించిన జక్కలవారిగూడెం, కచలాపురం , గంగోరిగూడెం గ్రామస్థులను MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. బెల్టు షాపులు నిర్మూలన చేపట్టిన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు సైదులు, జక్కలవారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జక్కల శ్రీను, రాంరెడ్డి, పాపయ్య, మహిళలు పాల్గొన్నారు.

News September 4, 2024

ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్‌ని కలవనున్న MLA వేముల

image

ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీవేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 30 న భువనగిరిలో మంత్రుల పర్యాటనకు ఎర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా పోలీసులువ ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే ఈ రోజు ప్రివిలేజ్ మోషన్‌ను స్పీకర్‌ని కలిసి అందించనున్నారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు.