India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డుకుని ఎండబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో మాట్లాడతామని స్పష్టం చేశారు. కవిత ‘లిల్లీపుట్’ వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డి పరువు తీసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి చేలలో ఇంకా తడారలేదు. వరద నీటిలోనే మొక్కలు ఉండడం అధిక తడితో మొలకలు ఎర్రబారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మొక్కలు ఎదిగే సమయానికి భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల పత్తి చేలల్లోకి నీళ్లు వచ్చాయని రైతులు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను మొత్తం రూ.140 (రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50) కమీషన్ రూపంలో డీలరుకు అందుతుంది.
ఖరీఫ్ సీజన్ సాగు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,73,162 ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. సింహభాగంలో పత్తి.. ఆ తర్వాత వరి సాగైంది. ఈసీజన్లో 11.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత వానాకాలం సీజన్లో 11.60,374 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి తక్కువగానే రైతులు సాగు చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు EKYC, THRలో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. ప్రస్తుతం EKYCలు 96 శాతం ఉందని దాన్ని నూరు శాతం చేయాలని, THRలు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని 30 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు.
NLG జిల్లాలోని MEPMA, హార్టికల్చర్ & సెరికల్చర్ డిపార్ట్మెంట్, DEO పరిధిలోని మోడల్ స్కూల్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు ఔట్ సోర్సింగ్ సేవలు అందించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో ఎంపానెల్ అయిన ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారన్నారు.
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, డీఈడీ, ఫార్మసిటికల్ కళాశాలలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. దీంతో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే వారి స్టడీ సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కొంతమంది విద్యార్థులు సదరు కళాశాలలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ – 2025లో పాల్గొనేందుకు SEP 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు www.skillindiadigital.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పోటీలు యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి
నేడే దీనికి ఆఖరు తేది.
మామను హత్య చేసిన కేసులో కోడలు పద్మ, ఆమె ప్రియుడు వేణుకు జీవిత ఖైదు పడినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. 2017 ఆగస్టు 3న నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మ, ఆమె ప్రియుడుతో ఇంట్లో ఉన్నప్పుడు మామ భిక్షమయ్య చూశాడు. ఈ విషయాన్ని తన కుమారుడికి చెబుతానన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరూ భిక్షమయ్యను హత్య చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు వారికి శిక్ష విధించిందని ఎస్పీ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.