Nalgonda

News October 24, 2025

ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

News October 24, 2025

2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

image

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.

News October 24, 2025

NLG: ఆ గ్రామానికి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం

image

చిట్యాల(M) ఉరుమడ్లకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా వ్యవహరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా, ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉండగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఇంత మంది రాజకీయంగా గుర్తింపు పొందడం విశేషం.

News October 24, 2025

ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలే వాడాలి: డీఈవో

image

నల్గొండ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్ఏ-1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయం పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News October 24, 2025

నల్గొండ: ఆక్యుపెన్సీ సరే.. ప్రయాణికుల రద్దీ సంగతేంది?!

image

నల్గొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగినా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్‌లో నిత్యం బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అధికారులు తక్షణమే అదనపు బస్సులు నడపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

News October 24, 2025

నల్గొండ: ముగిసిన టెండర్లు.. 27న లక్కీ డ్రా!

image

జిల్లాలో 154 మధ్య దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న ఒక్కరోజు 253 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. NLG (01-38 షాపు నెంబర్స్) 1417, MLG (39-64) 988, DVK (65-86) 621, NKL (87-104) 512, CDR (105-118) 398, హాలియా (119-138) 509, నాంపల్లి (139-154) 460 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 27న లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 24, 2025

NLG: జిల్లాలోనూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలు?

image

నల్గొండ జిల్లాలోనూ కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగుల వివరాలను కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీల్లో అక్రమాలు బయటపడే అవకాశం ఉండడంతో ఏజెన్సీల నిర్వాహకుల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

News October 24, 2025

NLG: సీసీఐ కొనుగోలు కేంద్రాల వివరాలు!

image

జిల్లా వ్యాప్తంగా ఇవాళ 9 CCI కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో సలపార్ కాటన్ మిల్ చండూరు, వరలక్ష్మి కాటన్ మిల్ చిట్యాల, శ్రీలక్ష్మినర్సింహ్మ ఆగ్రో ఇండస్ట్రీ మాల్ ఏ, శివగణేష్ కాటన్ మిల్ మాల్ బీ, శివగణేష్ కాటన్ మల్లేపల్లి ఏ, తిరుమల కాటన్ మిల్ మల్లేపల్లి బీ, శ్రీనాథ్ కాటన్ మిల్ NKL, సత్యనారాయణ కాటన్ మిల్ NLG, TRR కాటన్ మిల్ శాలిగౌరారం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.

News October 24, 2025

NLG: సర్కార్‌కు ఈసారి రూ.5.77 కోట్ల అదనపు ఆదాయం

image

ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంచినా.. కేవలం 256 దరఖాస్తులు మాత్రమే పెరిగాయి. 2023లో 7,057 దరఖాస్తులు రావడంతో అప్పుడు డిపాజిట్ ఫీజు రూ.2 లక్షలు ఉండగా రూ.141.41 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచినప్పటికీ రూ.147.18 కోట్ల ఆదాయమే సమకూరింది. గతంతో పోలిస్తే ఈసారి సర్కారుకు జిల్లా నుంచి కేవలం రూ.5.77 కోట్ల ఆదాయమే అదనంగా వచ్చింది.