Nalgonda

News September 27, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

News September 26, 2024

నల్గొండలో కొనసాగుతున్న మొబైల్ షాపుల బంద్

image

నల్గొండ జిల్లా కేంద్రంలో మొబైల్ షాప్ వ్యాపారుల మీద రాజస్థాన్ మార్వాడి వ్యాపారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నల్గొండ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా గురువారం జిల్లా కేంద్రంలోని అన్ని మొబైల్ షాపులు బందు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.

News September 26, 2024

సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు

image

నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురానానికి చెందిన సాయి (25), శైలజ(30) బట్టలు ఉతకడానికి సమీపంలోని ఎడమ కాల్వకు వెళ్లారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు శైలజ, సాయి పడిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసిన నీటీ ప్రవాహనికి కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

News September 26, 2024

NLG: యువతిపై బావబామ్మర్దుల హత్యాచారం.. కాపలా కాసిన తల్లి

image

దామరచర్ల మండలంలో జరిగిన <<14191461>>హత్యాచార <<>>కేసును పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాల ప్రకారం.. పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, బావ కాంత్రి కుమార్ అదే తండాకి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, వీరికి వారి తల్లి బుజ్జి సహయపడింది. అక్కడే కాపలాగా ఉండగా, ఇద్దరు కొడుకులు గొంతునొక్కి చంపి చెట్టుకు వేలాడదీశారు. తర్వాత యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.

News September 26, 2024

NLG: 11 మంది ఎస్ఐలకు స్థానచలనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్‌ను NLG DSB నుంచి SRPTకి, వెంకటేశ్వర్లును NLG VR నుంచి SRPTకి, కృష్ణయ్యను MLG టూ టౌన్ నుంచి మాడుగులపల్లికి, శోభన్ బాబును మాడుగులపల్లి నుంచి NLG VRకు, విజయ్ కుమార్‌ను వేములపల్లి నుంచి నల్గొండకు, సందీప్ రెడ్డిని NLG 1-టౌన్ నుంచి MLG రూరల్‌కు బదిలీ చేశారు.

News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలి: జేసీ శ్రీనివాస్

image

ఈ సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్)పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ ఇప్పటివరకు 90% పూర్తయిందని, తక్కిన 10శాతాన్ని ఈ వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. పూర్తిచేయని వారిని డిఫాల్టర్లుగా గుర్తిస్తామన్నారు.

News September 25, 2024

NLG: ప్రాజెక్టుల పెండింగ్ పనులను వేగవంతం చేయాలి: JC

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు, భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టు పనులన్నింటిని వేగవంతం చేయాలని తెలిపారు.

News September 25, 2024

దామరచర్ల: హత్యాచార కేసు ఛేదన

image

దామరచర్ల మండలం ఓ తండాలో ఈనెల 14న జరిగిన హత్యాచార కేసును ఛేదించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తండాకు చెందిన యువతిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెండ్ వేటు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సస్పెండ్ చేశారు. పెద్దవూర మండలం పులిచెర్లకు చెందిన కార్యదర్శి కే.నాగరాజు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాచ్యా తండాకు చెందిన జేపీఎస్ కే.స్వప్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను సస్పెండ్ చేశారు.