Nalgonda

News September 25, 2025

30 వరకు ఆసరా పింఛన్ల పంపిణీ: DRDO శేఖర్ రెడ్డి

image

జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో సహా అన్ని రకాల చేయూత / ఆసరా పింఛన్ల పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందని డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు పింఛను మొత్తాన్ని నేరుగా పోస్టల్ శాఖ వారి నుంచి మాత్రమే పొందాలన్నారు. మధ్య దళారులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

News September 25, 2025

NLG: ఘోర ప్రమాదం.. చిన్నారి మృతి

image

కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన కారు ఆపి రిపేరు చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్ కారును బలంగా ఢీకొట్టడంతో కారులోని చిన్నారి మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను నకిరేకల్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 25, 2025

NLG: దిగుబడి పెరిగినా… గిట్టుబాటు ఏది?

image

అకాల వర్షాలు నిమ్మ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వర్షాల పేరుతో దళారులు ధర తగ్గించటంతో రైతులు దిగాలు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, రవాణా ఖర్చులు, వ్యాపారుల కమీషన్లను ఎదుర్కొనేలా దిగుబడి వచ్చినా ధర లేక రైతులు తల పట్టుకున్నారు. నకిరేకల్ ప్రాంతంలో ఈసారి భారీగా నిమ్మ దిగుబడులు పెరిగాయి. పది రోజుల నుంచి నిమ్మ ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రస్తుతం బస్తా ధర రూ.300లకే మించడం లేదని రైతులంటున్నారు.

News September 25, 2025

NLG: మదర్ డెయిరీలో 27న పోలింగ్

image

NLG-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికల్లో 9 మంది బరిలో నిలిచారు. డెయిరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు సభ్యుల నియామకం కోసం దాఖలు చేసిన నామినేషన్ల స్క్రూట్ని ఉపసంహరణ అనంతరం 9 మంది తుది జాబితాలో ఉన్నారు. హయత్‌నగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.

News September 24, 2025

యువకుడిపై థర్డ్ డిగ్రీ ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ శరత్‌చంద్ర పవార్

image

వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై <<17816507>>థర్డ్ డిగ్రీ<<>> ప్రయోగించారనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్పష్టం చేశారు. దామరచర్ల మండలం కొత్తపేటకు చెందిన సిద్దు, నవీన్ దాడి కేసులో నిందితులుగా ఉన్నారన్నారు. వారు తమ తల్లిదండ్రులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. యూరియా కోసం ధర్నా చేసినందుకు వారిని అరెస్టు చేయలేదని ఎస్పీ వివరించారు.

News September 24, 2025

పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయండి: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులోనూ నాణ్యతతో కూడిన, పారదర్శకమైన విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎస్పీ మౌనిక పాల్గొన్నారు.

News September 24, 2025

పోలీసులపై అసత్య ప్రచారం చేయొద్దు: ఎస్పీ

image

పోలీసులపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవర్ కోరారు. వాడపల్లి పీఎస్‌లో యువకుడిపై ఎస్సై శ్రీకాంత్ రెడ్డి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. దామరచర్ల మం. కొత్తపేటతండాకు చెందిన సాయి సిద్దు, సుమన్ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ గొడవ పడ్డారని, ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా కొట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించామని వివరించారు.

News September 24, 2025

27న ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో పోటీలు

image

ఉమ్మడి జిల్లా తైక్వాండో అండర్‌-14, 17 బాల, బాలికల క్రీడా పోటీలు ఈ నెల 27న నల్గొండలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ దగ్గుపాటి విమల తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని ఆమె సూచించారు. వివరాలకు 9703269840 నంబరును సంప్రదించాలని కోరారు.

News September 23, 2025

NLG: స్థానికంలో రొటేషన్.. మారనున్న స్థానాలు!

image

జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. BRS ప్రభుత్వ హయాంలో 2 సార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి.

News September 23, 2025

నల్గొండ: ప్రజావాణికి 72 దరఖాస్తులు

image

నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 46, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వ్యక్తిగత అంశాలు, భూ వివాదాలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, DRDO శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.