Nalgonda

News September 24, 2024

యాదాద్రి కలెక్టర్‌తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం

image

పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. నేడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత్, జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

News September 24, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,152 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 44,153 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. కుడి కాలువకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2,765 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1,800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

News September 24, 2024

పోలీస్ గ్రీవెన్స్ డేకు 57 దరఖాస్తులు: ఎస్పీ

image

NLG: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 57మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

News September 23, 2024

NLG: మూసీ గేట్లు ఓపెన్..

image

మూసీకి వరద పొటెత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు. హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంతో కేతపల్లి మండలం భీమారంలో వరద పొట్టెత్తింది. పశువుల కాపర్లు వాగులో చిక్కుకున్నారు. 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆదేశాలతో వారిని జేసీబీ సాయంతో తీసుకోచ్చారు. హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News September 22, 2024

చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

image

గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.

News September 22, 2024

యాదాద్రి: గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి

image

గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని (తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

News September 22, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తాజా UPDATE

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో: 44,870 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 37,953 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

News September 22, 2024

విద్యుత్ తీగ తెగి మీద పడి రైతు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్‌మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. స్థానికుల ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.

News September 21, 2024

కేతేపల్లి: భూమి పట్టా చేయనందుకే హత్య

image

ఈనెల 17న కేతేపల్లి మండలం <<14128705>>చెర్కుపల్లిలో దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. సీఐ కొండల్ రెడ్డి వివరాల ప్రకారం.. పిట్టల సైదులు పేరు మీద ఉన్న 2ఎకరాల భూమి పట్టాచేయాలని కొడుకు నవీన్, భార్య ప్రమీల ఒత్తిడి తెచ్చారు. సైదులు అందుకు నిరాకరించడంతో ప్రమీల, నవీన్ కలిసి రోకలి బండతో హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు మండలంలోని కొండకిందిగూడెం శివారులో సంచరిస్తుండగా అరెస్టు చేశామన్నారు.

News September 21, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరుంది. ఔట్ ఫ్లో: 31,196 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 31,196 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.