India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NLG మునిసిపాలిటీ కార్పొరేషన్ అయ్యే కల సాకరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2018 ఎన్నికలకు ముందు BRS ప్రభుత్వం NLGను మహానగరంగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో 7 గ్రామాలను విలీనం చేయగా ఆ గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. 3 నెలల క్రితం మళ్లీ ప్రతిపాదనలు చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.

నల్గొండ జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాల అదుపునకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఆపరేషన్ చబుత్ర’ సత్ఫలితాలనిస్తోంది. 30 బృందాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ కింద 337 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 300 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

14 నెలల పదవీకాలంలో కలెక్టర్గా ఇలా త్రిపాఠి జిల్లాలో తనదైన ముద్రవేశారు. 2024 అక్టోబరు 28న ఇలా త్రిపాఠి కలెక్టర్గా నియమితులయ్యారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమవడమే గాక పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా విద్యాభివృద్ధి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేశారు.

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్ నాటికి కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.

జర్మనీ దేశంలోని పేరొందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. 22 నుంచి 38 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, GNM, ఒకటి, రెండేళ్లు క్లినిక్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలి.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026 నిర్వాహణ బాధ్యతను నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఐసెట్ కన్వీనర్ గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్, రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవిని నియమించారు.

నల్గొండ పట్టణం పానగల్లులోని ఎస్ఈ ఆఫీసులో మిషన్ భగీరథ కార్మికులతో అధికారులు, కాంట్రాక్టర్స్ సంయుక్త సమావేశం నిర్వహించారు. కార్మికులు తమ డిమాండ్లను అధికారులు, కాంట్రాక్టర్స్ ముందుంచారు. ప్రస్తుత వేతనంపై రూ.2 వేలు పెంచాలని, ప్రతినెల 5 లోపల వేతనం చెల్లించాలని, ఏడాదికి 2సార్లు బోనస్, కార్మికులకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ నుంచి గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్ ఇవ్వాలన్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ భావించారు. ఎవరు ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆశావహుల సందడితో ఎన్నికల వేడి మొదలైంది.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ ఆగిపోయింది. ఆయన్ను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్గా నియమించినట్లు ఈనెల 25న వెలువడిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ బదిలీ ప్రక్రియ రద్దు చేయడంతో మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా ఆయన యథావిధిగా కొనసాగనున్నారు. కాగా నల్గొండ డీపీఓ వెంకయ్యను ములుగు జిల్లా డీపీఓగా బదిలీ చేశారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.