Nalgonda

News April 21, 2024

REWIND.. నల్గొండ నుంచి 480 మంది పోటీ

image

28 ఏళ్ల కిందట నల్గొండ లోకసభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి రికార్డు సృష్టించారు. ఒకే పార్లమెంట్ స్థానం నుంచి 480 మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి నీటి సమస్యే అసలు కారణం. జిల్లా నుంచే జీవ నదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని జల ఉద్యమకారులు భావించారు. కృష్ణానది జలాల్లో 76 శాతం వాటా తమకు రావాల్సిన ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండాపోయిందని పోరాటం చేశారు.

News April 21, 2024

నల్గొండ: సెలవు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

image

ఆదివారం సెలవు ఇవ్వనందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్న శంకర్ ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను అడగ్గా కుదరదని చెప్పడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

News April 21, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

image

నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిరికంటి సైదయ్య మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బొత్తల పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సైదులు విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

News April 21, 2024

నల్గొండ: మూడు రోజుల్లో పెళ్లి.. యువతి మిస్సింగ్

image

తిప్పర్తి మండలంలో శనివారం యువతి అదృశ్యమైంది. సర్వారం గ్రామానికి చెందిన సదరు యువతికి వివాహం నిశ్చయమైంది. ఈనెల 24న వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్ఐ రాజు తెలిపారు.

News April 21, 2024

MLG: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

మిర్యాలగూడ టీఎన్జీవోస్ (NSP) యూనిట్ ఉపాధ్యక్షులు షేక్ మౌలానా (48) శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన MLG నీటిపారుదలశాఖ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. టీఎన్జీవోస్ ఉద్యోగుల సమస్యలపై క్రియాశీలకంగా పని చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News April 21, 2024

నల్గొండ: గుండెపోటుతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

image

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి (దేవరోనితండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లమా(EEE) 3వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి ఉండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు.

News April 21, 2024

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

image

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం HYD నుంచి హెలికాప్టర్లో వస్తే భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగనున్నారు. రోడ్డు మార్గంలో వస్తే పెద్ద చెరువు నుంచి టాప్స్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ HYD చౌరస్తా, జగదేవపూర్ చౌరస్తా మీదుగా వినాయక చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ అనంతరం సాయిబాబా గుడి వరకు ర్యాలీగా ముందుకు సాగుతారు.

News April 21, 2024

నల్గొండ జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారు

image

వచ్చే వానాకాలం-2024 సీజన్ పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్లో మొత్తం 11,47,954 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ప్రణాళికను ఖరారు చేసింది. అందు లో వరి 5,19,160 ఎకరాలు, పత్తి 5.40లక్షల ఎకరాలు, కంది 4,710, పెసర 1,468, మినుములు 946, జొన్న 185, నువ్వులు 35, వేరుశనగ 1,145, జనుము 56,030, జీలుగ 15,440, పిల్లిపెసర 8,835 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది.

News April 21, 2024

24న మిర్యాలగూడకు కేసీఆర్: భాస్కర్ రావు

image

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ MP అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మిర్యాలగూడ మాజీ MLA నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సిఎం కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. కేసీఆర్ శ్రీకారం చుట్టనున్న రోడ్ షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

News April 21, 2024

మే 26 నుంచి అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కో-ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ తెలిపారు. ప్రధమ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు మే 6 వరకు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929758, 9553568049 నంబర్లను సంప్రదించాలన్నారు.