India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
శ్రీశైలం డ్యామ్ వద్ద నల్గొండ జిల్లా వాసి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపాలిటీలోని వెంకటాపురంకి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి హామాలీలతో వెళ్లాడు. శ్రీశైలం డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.
ప్రతినెల నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదామును తనిఖీ చేశారు. ఈవీఎం గోదాము వద్ద భద్రతను, పరిసరాలను ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, ఎన్నిక్షల విభాగం డిటి విజయ్, కృష్ణమూర్తి ఉన్నారు.
విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బొమ్మలరామారం మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. APకి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో మల్యాలకు వచ్చి మామిడి తోటలో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మతిస్తిమితం సరిగా లేక తోటలోని చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భూక్రయ విక్రయాలు మళ్ళీ ఊపందుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కొనుగోలుదారులు, అమ్మకందారులతో కిటకిట లాడాయి. జిల్లాలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇరుకుగా ఉండడంతో కనీసం కూర్చునేందుకు సైతం స్థలం లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో జనాలు వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531.50 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170.89 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 2,80,512 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 7,012 క్యూసెక్కులుగా ఉంది.
సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్డుప్రమాదాలు, వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫ్లై ఓవర్ను నిర్మించాలని ఆర్అండ్బీ, వ్యవసాయ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు NHAI అధికారులను బుధవారం కోరడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే వాెహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి.
సాగర్ జలాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకే కాక తాగు నీటి అవసరాల కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని ఉత్తమ్ను మంత్రి తుమ్మల కోరారు. ఈనెల 2న శుక్రవారం నీటి విడుదలకు అంగీకరించిన మంత్రి ఉత్తమ్ నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
@ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు @ ప్రస్తుత నీటి మట్టం 526.40 అడుగులు@ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.@ ప్రస్తుత నీటి నిల్వ 161.2064టీఎంసీలు@ ఇన్ ఫ్లో: 2,18,560 క్యూసెక్కులు@ ఔట్ ఫ్లో: 6,782 క్యూసెక్కులు
Sorry, no posts matched your criteria.