Nalgonda

News March 21, 2026

NLG: అంగన్‌వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు!

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అంగన్‌వాడీ టీచర్లకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు వీలుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. కాగా గతంలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడం, సిగ్నల్ సమస్యలతో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 21, 2026

NLG: అంగన్‌వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు!

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అంగన్‌వాడీ టీచర్లకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు వీలుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. కాగా గతంలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడం, సిగ్నల్ సమస్యలతో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 21, 2026

NLG: అంగన్‌వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు!

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అంగన్‌వాడీ టీచర్లకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు వీలుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. కాగా గతంలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడం, సిగ్నల్ సమస్యలతో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 21, 2026

NLG: అంగన్‌వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు!

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అంగన్‌వాడీ టీచర్లకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు వీలుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. కాగా గతంలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడం, సిగ్నల్ సమస్యలతో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 20, 2026

నల్గొండ: బడ్జెట్‌లో ‘చేయూత’.. త్వరలో కొత్త పింఛన్లు

image

రాష్ట్ర బడ్జెట్ (2026-27)లో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని 57 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులు ఈ ‘చేయూత’ పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

News March 20, 2026

నల్గొండ: కాయ కాచినా.. కష్టం తీరలేదు

image

వేసవి వచ్చిందంటే బత్తాయి రైతు ఇంట సిరులు కురవాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇటు పక్కనేమో పండుగలు, అటు సరిహద్దుల్లో యుద్ధాలు.. వెరసి బత్తాయి తోటల్లో కోతలు ఆగిపోయి రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధం వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పండ్ల ఎగుమతి, దిగుమతుల చైన్ పూర్తిగా దెబ్బతిందని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు లారీల కిరాయిలు 10 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.

News March 20, 2026

నల్గొండ: 400 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News March 20, 2026

నల్గొండ కేవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నల్గొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతి, బాలవాటిక-3లో చేరేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే 2 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 2 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 20, 2026

నల్గొండ: శనివారమే రంజాన్‌ వేడుకలు

image

జిల్లాలో మార్చి 21న రంజాన్ జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ తెలిపారు. స్థానిక ఈద్గాలో ఉదయం 8:30 గంటలకు, మదీనా, ఉస్మానియా మసీదుల్లో 8:00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) జరుగుతాయి. ముస్లిం సోదరులు పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News March 20, 2026

నల్గొండ: శనివారమే రంజాన్‌ వేడుకలు

image

జిల్లాలో మార్చి 21న రంజాన్ జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ తెలిపారు. స్థానిక ఈద్గాలో ఉదయం 8:30 గంటలకు, మదీనా, ఉస్మానియా మసీదుల్లో 8:00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) జరుగుతాయి. ముస్లిం సోదరులు పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.