India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయా.? తెలంగాణ శాసనసభ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ఈ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క స్థానం సూర్యాపేట నుంచి జగదీశ్ రెడ్డి గెలిచారు. ఓ హత్య కేసులో జగదీశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి తెలిపారు.
బోడ కాకరకాయ మార్కెట్లో భలే గిరాకి ఉంది. సంవత్సరంలో కేవలం నెలన్నర మాత్రమే లభించే బోడ కాకరకాయల కోసం ప్రజలు ఎదురు చూస్తారు. సీజన్లో కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భువనగిరి కూరగాయల మార్కెట్లో కిలో బోడ కాకరకాయ ధర రూ.400 వరకు పలుకుతోంది. రసాయనాలు లేకుండా పండే బోడ కాకరకాయ ధర కోడి మాంసం కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.
నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాలైన రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువ కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచే మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి వరకు 642.5 అడుగులకు పెరిగింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 514.66 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 139 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ఇన్ ప్లో: 1,41,560 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 28,973 క్యూసెక్కులకు చేరుకుంది.
ఉమ్మడి జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు ముచ్చటగానే మిగులుతున్నాయి. 24 గంటలు సేవలు అందించాల్సి ఉండగా వైద్యులు సిబ్బంది కొరత వల్ల సమయం కుదించారు. రోజు సాయంత్రం 6 గంటలకే ఆసుపత్రిని మూసి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర సమయంలో రోగులు పట్టణాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది రైతులకు మొదటి విడత రుణమాఫీ కాలేదు. రాష్ట్ర అధికారుల సూచన మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు 3 వేల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1,800 మంది రైతుల ఆధార్ నంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి వారికి రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియజేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పోచంపల్లి: 13 అడుగుల పొడవైన జుట్టుతో లక్ష్మణాచారి అందరినీ ఆకర్షిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన గుండోజు లక్ష్మణాచారి(72) వీరభద్ర స్వామి తన 18వ ఏట వీరభద్ర స్వామి కలలో కనిపించాడు. దీంతో జుట్టు కత్తిరించుకోకుండా దేవుడికి అర్పించినట్లు లక్ష్మణాచారి తెలిపారు.
ఓ దివ్యాంగురాలిని అత్యాచారం చేసిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం(M)లో జరిగింది. SI సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మతిస్థిమితం సరిగా లేదు. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పనికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(50) ఇంటికి వచ్చి మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి కూతురు జరిగింది చెప్పడంతో సోమవారం పోలీసులను ఆశ్రయించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల లోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో నేడు రెండో విడత రుణమాఫీ డబ్బులను జమ చేయనుంది. ఇప్పటికే నల్గొండ జిల్లా అర్హుల జాబితాను వ్యవసాయ అధికారులు వెల్లడించారు. నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని కలెక్టరు నారాయణరెడ్డి నేడు ప్రారంభించనున్నారు.
జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పై నుండి వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తమవ్వాలని అన్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువలో ఉన్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.