Nalgonda

News March 8, 2025

కలెక్టర్, ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి కోమటిరెడ్డి సన్మానం

image

శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎమ్మెల్యే నల్లమాద పద్మావతిలను మంత్రి కోమటిరెడి స్వయంగా సన్మానించి మహిళా దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

News March 8, 2025

నల్గొండ: మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసిన ఎస్పీ

image

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మహిళా సిబ్బందితో కలిసి తన కార్యాలయంలో సతీమణి పూజతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, అదేవిధంగా మహిళలందరూ కష్టపడి ఎదుగుతన్నారన్నారు. మహిళా సాధికారతను సాధించాలని.. అప్పుడే ఈ సమాజం మీకు గుర్తింపు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News March 8, 2025

నల్గొండ: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ

image

నల్గొండ పట్టణంలోని ఉస్మాన్‌పురాకు చెందిన హై స్కూల్ అటెండర్ <<15575023>>మహమ్మద్ ఖలీల్<<>> గతనెల 25న మరణించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సమయంలో ఖలీల్ ఒంటిపై గాయాలను చూసిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో హత్యేనని రిపోర్టు వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యే హత్య చేసినట్లు తేలింది. హత్య భార్య చేసిందా లేదా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 8, 2025

నల్గొండ: ఈ గ్రామ మహిళలు అందరికీ స్ఫూర్తి 

image

చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన మహిళలు ఇతర గ్రామాల మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తమ గ్రామంలో మద్యం అమ్మకాలు జరపకూడదని పోరాటం చేసి విజయం సాధించారు. బెల్టు షాపులను మూసివేయించారు. మద్యం సేవించి ఇటీవల గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గ్రామానికి చెందిన మహిళల్లో పోరాట పటిమను పెంచి, మద్యంపై యుద్ధం చేయించింది.

News March 8, 2025

నల్గొండ: మహిళా జర్నలిస్టుగా రాణిస్తున్న కవిత

image

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన కట్ట కవిత జర్నలిస్టుగా రాణిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2017లో ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. మీడియాలో పనిచేస్తున్న వారికి ఇచ్చే నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా 2020 ఫెలోషిప్‌ని కూడా ఆమె అందుకున్నారు.

News March 8, 2025

నల్గొండ: 30 రోజుల్లో 3 వేల బోర్లు!

image

ఓవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు.. మరోవైపు అడుగంటుతున్న జలాశయాలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో నాన్ఆయకట్టులో వరి పంటకు తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క NLG మండలంలోనే నెల రోజుల్లో 3 వేల వరకు కొత్తగా బోర్లు వేసినట్లు సమాచారం.

News March 8, 2025

NLG: 576 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 14,403 మంది విద్యార్థులకు గాను 13,827 మంది హాజరయ్యారు. కాగా 576 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

News March 8, 2025

NLG: పోలీసులకు ఎస్పీ అభినందనలు

image

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. కిడ్నాప్ అయిన బాలుడితోపాటు నల్గొండ టూటౌన్ పోలీసులు శుక్రవారం ఎస్పీని కలిశారు. బాలుడిని ఎస్పీ ఎత్తుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను ప్రశంసించారు.

News March 7, 2025

NLG: రేపు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు & ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎం. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ కేసులు రాజీ చేసుకోగలరని సూచించారు.

News March 7, 2025

REWIND: ఎలిమినేటిని హిట్ లిస్ట్‌లో పెట్టి చంపేశారు!

image

<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో హోం మినిస్టర్‌ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. గద్దర్‌పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్‌ ఎన్‌కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్‌వార్‌ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లో చేర్చి చంపింది.