Nalgonda

News July 29, 2024

నాగార్జున‌సాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53,774 క్యూసెక్కులు వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 510.2 అడుగులుగా ఉంది. 312.05 టీఎంసీలకు గాను 131.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండుకుండను తలపిస్తోండగా రేపు గేట్లు అవకాశముంది. అదే జరిగితే సాగర్ త్వరలోనే నిండనుంది.

News July 29, 2024

డిండి జలాశయంలో తగ్గిన నీటిమట్టం

image

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డిండి జలాశయంలో నీటిమట్టం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 20.5 అడుగులు మాత్రమే నిల్వ ఉంది. జూన్ 28న జలాశయంలో 26 అడుగులు నీరు నిల్వ ఉండగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. వర్షాలు లేక ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

News July 28, 2024

NLG: బొమ్మలు చూసి ప్రయాణికుల పరుగు

image

NLGలోని సావర్కర్ నగర్ చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు పైవంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వస్త్ర దుకాణాల్లో అలంకారానికి వాడే బొమ్మలను పడేశారు. రాత్రి సమయంలో తెల్లగా మనుషులను పోలి ఉన్న వాటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. రైలు దిగి వస్తున్న సమయంలో ఆ బొమ్మలను చూసి భయంతో పరుగులు తీశామని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఈ దారిలో చెత్తాచెదారం వేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News July 28, 2024

నల్గొండలో రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

image

నల్గొండ చర్లపల్లి సప్తగిరి విల్లాస్ ఎదురుగా రోడ్డు దాటుతున్న మహిళని నల్గొండ నుంచి నార్కెట్ పల్లి వైపు వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లింది. దామరచర్ల మండలానికి చెందిన వీరి కుటుంబం చర్లపల్లి గ్రామంలో నివసిస్తూ రోజు వారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

News July 28, 2024

SRPT: పండుగకు తీసుకెళ్లి భూమి పట్టా చేయించుకున్నాడు

image

పండుగకు తీసుకెళ్లి తమ భూమిని
అక్రమంగా మేనల్లుడు నాగరాజు పట్టా
చేయించుకున్నారని, మద్దిరాలకు చెందిన గురువోజు సోమాచారి వెంకటమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావుకు శనివారం ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఎలాగైనా తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

News July 28, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం ఈ విధంగా ఉంది. ఇన్ ఫ్లో: 39,338 క్యూసెక్కులు ఔట్ ఫ్లో: 6,282 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 130.43 టీఎంసీలు

News July 28, 2024

భాగ్యలక్ష్మి అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

image

మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ ఉత్సవాలు సాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మ వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

News July 28, 2024

సర్కారు స్కూళ్లను వెంటాడుతున్న సమస్యలు

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3210 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 2.11 లక్షల పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాధారణంగా సర్కార్ బడుల నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తుంది. స్కూలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటి వరకు నిర్వహణ గ్రాంటును విడుదల చేయలేదు.

News July 28, 2024

వీధి వ్యాపారులకు త్వరలో పీఎం స్వనిధి కార్డుల పంపిణీ

image

మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారి వ్యాపార నిర్వహణకు ఇప్పటికే రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వీధి వ్యాపారానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో 37,784 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. తాజాగా ఆయా వ్యాపారాలు చేసే పనికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News July 28, 2024

NLG: జిల్లాలో ఇక స్థానిక జోష్

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.