India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు మరోసారి ఛార్జ్ మెమోలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. గతంలోనే 109 మందికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ అధికారి తాజాగా 134 మందికి ఛార్జి మెమోలు అందజేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు విచారణలో తేలితే.. వారి సర్వీస్ బ్రేక్ చేయనున్నారు.
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పని రకాలు ఉంటాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
నల్గొండ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 12,675 మంది జనరల్ విద్యార్థులు, 2010 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 14,685 మంది హాజరు కావాల్సి ఉండగా.. జనరల్ విద్యార్థులు 12,272 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,794 మంది విద్యార్థులు కలిపి 14 వేల 66 మంది హాజరయ్యారు. 403 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 619 గైర్హాజరయ్యారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపం అంటూ ఆ తండ్రి చెబుతున్నాడు.మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరసిస్ కారణంగా చిన్నప్పుడే కాళ్లు పనిచేయడం లేదు. నేడు మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ ఓటమితో ఆ యూనియన్ ఆలోచనలో పడింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండో స్థానానికి పడిపోవడంపై యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటో విశ్లేషణ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
నల్లగొండ జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 88 టీచర్ పోస్టులు, 374 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కక్కుతున్న ఎండలతో నీలగిరి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మధ్యాహ్నం వేళ మరింత భగభగమండిపోతున్నాడు. దాంతో ఇటు వేడి.. అటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మంగళవారం జిల్లాలో 39 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనుముల, నార్కెట్పల్లి, మాడ్గులపల్లి మండలాల్లో 39.9, కట్టంగూరు, చండూరు మండలాల్లో 39.8 అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28,722 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 13,992 సెండియర్లో 14,730 మంది విద్యార్థులు రాయనుండగా.. 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. ALL THE BEST
Sorry, no posts matched your criteria.