Nalgonda

News April 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు స్పందన అంతంత మాత్రమే!

image

ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఎల్ఆర్ఎస్ కింద మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29 వరకు 1418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒక్క సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.

News April 1, 2025

NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News April 1, 2025

NLG: దొడ్డు బియ్యం వేలానికి కసరత్తు!

image

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4,65,943 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. కాగా ఎఫ్సీఐ, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే కంపెనీ చేయగా కొంతమేరకు డీలర్ల వద్ద కూడా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నారు.

News April 1, 2025

నల్గొండ: రాజీవ్ యువ వికాసం గడువు పెంపు

image

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు గానూ ఏప్రిల్ 14 వరకు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మ్యానువల్‌గా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 1, 2025

నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు అందించే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30గంటలకు HYD చేరుకుంటారు.

News March 31, 2025

నల్గొండ: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

image

గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాటిగూడెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేశాడో భర్త. రోజూ తాగి వస్తున్న భర్తతో భార్య అరుణ(35) సోమవారం గొడవకు దిగింది. దీంతో ఆవేశానికి గురైన భర్త గొడ్డలితో ఆమెపై దాడి చేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2025

NLG: టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

image

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.

News March 31, 2025

NLG: వ్యవసాయ అనుసంధాన పనులకూ ‘ఉపాధి’

image

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.

News March 31, 2025

నల్గొండ జిల్లాలో భక్తిశ్రద్ధలతో.. ఈద్‌ ఉల్‌ ఫితర్‌

image

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్‌ పండుగను సోమవారం ముస్లింలు సంతోషంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మసీదు, ఈద్గాలు, తదితర చోట్ల వద్ద ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

News March 31, 2025

గ్రూప్‌-1 ఫలితాల్లో నల్గొండ జిల్లా వాసికి సెకండ్ ర్యాంక్

image

నల్గొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్‌-1లో 535 మార్కులతో జనరల్‌ ర్యాంకుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్‌ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రమాదేవి అనుముల మండలం అలీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్‌, డీఏఓ, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యారు.