Nalgonda

News July 23, 2024

జిల్లాలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

image

గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. మహిళా శక్తి పథకంలో భాగంగా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. మెరుగైన ప్రగతి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి వ్యాపార నిర్వహణ సామర్థ్యం గల సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తిస్తుంది. మిర్యాలగూడ, నకిరేకల్, నల్గొండ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయంలో క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

News July 23, 2024

రోడ్డు ప్రమాదంలో CRPF కానిస్టేబుల్ మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోదాడలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చింత రాజు( 23) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. కోదాడ సమీపంలోని కట్టుకోమ్ముగూడెం రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. చింత రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 23, 2024

చిరుత గేదెలపై దాడి చేసింది: రైతు మోతీలాల్

image

నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. రెండు గేదెలపై చిరుత దాడి చేసి చంపిందని  డిండి మండలం కొత్త తండాకు చెందిన రైతు మోతీలాల్ చెప్పారు. మోతీలాల్ పొలం తండాకు ఆనుకుని ఉండడంతో చిరుత మళ్లీ వస్తుందేమో అని తండావాసులు భయపడుతున్నారు. అధికారులు చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. 

News July 23, 2024

NLG: కూరగాయల సాగు అంతంతే..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూరగాయల సాగు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 18 వేల ఎకరాల్లో కూరగాయలు పండించాల్సిన అవసరం ఉండగా.. కేవలం వందల ఎకరాల్లో మాత్రమే రైతులు కూరగాయలు పండిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా సాగు లేకపోవడంతో 40 నుంచి 70 శాతం వరకు కూరగాయలు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

News July 23, 2024

పూర్తయిన సాగర్ ప్రాజెక్టు స్పిల్ వే మరమ్మతు పనులు

image

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు జలాశయంలో నీటిని నింపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. పదేళ్ల క్రితం సాగర్ డ్యాం స్పిల్ వే దెబ్బతినగా పలుమార్లు టెండర్లు పిలిచి చివరగా రూ.16కోట్లకు ఓ కంపెనీకి పనులు అప్పగించారు. గతేడాది నుంచి వర్షాలు లేకపోవడంతో స్పిల్ వే పనులు పూర్తి చేశారు.

News July 23, 2024

NLG: జిల్లాలోని చెరువుల సంగతేంటి?

image

నల్గొండ జిల్లాలో చెరువులు నింపకుండానే నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడంపై ఈ జిల్లా రైతులు మండిపడుతున్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో చెరువులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని నింపకుండా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తుండడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

NLG: రుణమాఫీ కోసమే భారీగా దరఖాస్తులు

image

కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి రెవెన్యూ, రుణమాఫీ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బాధితులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ తో పాటు బయట ఆవరణ అంతా జనంతో నిండిపోయింది. మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూసమస్యలకు సంబంధించి 53.. ఇతర అంశాలవి 43 ఫిర్యాదులు ఉన్నాయి. రుణమాఫీ కాలేదంటూ సుమారు వంద మంది రైతులు అర్జీలు అందజేశారు.

News July 23, 2024

నల్గొండ: నేటి నుంచి ఆసరా ఫించన్ల పంపిణీ

image

నల్గొండ జిల్లా పరిధిలోని ఆసరా ఫించన్ దారులకు మంగళవారం నుంచి ప్రభుత్వం ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో పీడీ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక తపాలశాఖ కార్యాలయాల్లో నేటి నుంచి ఈ నెల 29 వరకు ఫించన్లు పొందవచ్చని తెలియజేశారు. పంపిణీలో మధ్య దళారీల మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

News July 23, 2024

నల్గొండ: డిగ్రీ ఫలితాలు విడుదల

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫలితాలను HYDలో యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ నవీన్ మిట్టల్, రిజిస్ట్రార్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి, అడ్మిషన్ డైరెక్టర్ ఆకుల రవి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 8,118 మంది విద్యార్థులకు గాను 3,493 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.

News July 23, 2024

ప్రజావాణి కార్యక్రమానికి 80 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమనికి మొత్తం 80 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 38 దరఖాస్తులు, డిఆర్డిఓ 12, డియంహెచ్ఓ 8, ఇతర శాఖలకు సంబంధించి 22, మొత్తం 80 దరఖాస్తులు అందాయని తెలిపారు.