Nalgonda

News July 12, 2024

వేధింపుల కేసులో నిందితుల అరెస్టు

image

మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఆకతాయి వేధింపులకు గురై <<13605754>>కళ్యాణి <<>>అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురిచేసిన నిందితులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

News July 12, 2024

బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బీబీనగర్ నాయకులు

image

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాశం భాస్కర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.

News July 12, 2024

తిప్పర్తి: యువతి సూసైడ్.. పరారీలో నిందితులు

image

మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పరిధిలోని చింతల గూడేనికి <<13605754>>యువతి <<>>ఆత్మహత్యకు కారణమైన నిందితులు పరారీలో ఉన్నారు. ఇద్దరు యువకులు కళ్యాణిని వేధించడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన యువకులను పట్టుకోవడానికి పోలీసులు 3 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

News July 12, 2024

మిర్యాలగూడ: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

image

ఉరేసుకుని మైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓకాలనీకి చెందిన ఓ మైనర్(13) 9వ తరగతి చదువుతోంది. తండ్రి మరణించడంతో తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుంది. గురువారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళలేదని బాలికను తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

News July 12, 2024

నల్గొండ: పీడీఎస్ బియ్యం అమ్మితే.. డీలర్ షిప్ రద్దు

image

పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 11, 2024

రేవంత్‌‌తో సమానంగా భట్టి ఫొటోను పెట్టాలి: మోత్కుపల్లి

image

ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటోను అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేయడం హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News July 11, 2024

నల్గొండ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫుడ్ కోర్టు!

image

నల్గొండ జిల్లా కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులో బీట్ మార్కెట్ యార్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో ఫుడ్ కోర్టు నిర్మాణాలకు స్థలం కేటాయించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వారం పది రోజుల్లో ఫలహారశాల నిర్మాణాలకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

News July 11, 2024

NLG: వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి

image

తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

News July 11, 2024

NLG: రైలులో యువతితో అసభ్య ప్రవర్తన.. నిందితుడు అరెస్ట్

image

రైలులో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు బిశ్వాల్‌‌ను నల్గొండ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో పాటు రైలు నుంచి కిందపడి గాయాలపాలైన బిశ్వాల్ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News July 11, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు యువతి సూసైడ్

image

ప్రేమ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగూడానికి చెందిన కళ్యాణి(19)ని అదే గ్రామానికి చెందిన శివ, మధు అనే ఇద్దరు యువకులు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈనెల 6న కళ్యాణికి ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో కళ్యాణి పురుగు మందు తాగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.