Nalgonda

News March 13, 2025

నలుగురు నల్గొండకు చెందినవారే..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఐదుగురిలో విజయశాంతి తప్ప మిగతా నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.

News March 13, 2025

నల్గొండ: పోలీస్ అంటేనే ఒత్తిడితో చేసే ఉద్యోగం: కలెక్టర్

image

పోలీస్ ఉద్యోగం అంటే ఒత్తిడితో చేసే ఉద్యోగమని, శారీరక స్ఫూర్తితో పాటు అలర్ట్ కావడానికి క్రీడలు మానసికంగా ఉపయోగపడుతాయని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025కు గురువారం ఉదయం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

News March 13, 2025

నల్గొండ: మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీం నిఘా: SP

image

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై షీ టీం నిఘా ఉంటుందని.. ఈనెల 14న శుక్రవారం నిర్వహించుకునే హోలీ వేడుకల్లో ఇతరులకు హాని కలిగించొద్దని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, కలిసి మెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 13, 2025

నల్గొండ: 15 నుంచి ఒంటిపూట బడులు..!

image

నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈనెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహిస్తామని జిల్లా డీఈవో భిక్షపతి అన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిగంట నుంచి ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు జరగనున్నాయి. SHARE IT.

News March 13, 2025

నల్గొండ: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: SP 

image

జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందస్తుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు ఫైల్ కావడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.

News March 13, 2025

నల్గొండ: పోలీస్ శాఖకు టీం స్పిరిట్ చాలాముఖ్యం: కలెక్టర్

image

పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.

News March 13, 2025

నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

image

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News March 13, 2025

NLG: యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త పథకానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం 30వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అంటున్నారు.

News March 13, 2025

GOOD NEWS.. హైదరాబాద్‌లోకి నల్గొండ జిల్లా

image

హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 31 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

News March 13, 2025

NLG: 368 మంది విద్యార్థులు గైర్హాజరు: DIEO

image

ఇంటర్మీడియట్ సెకండియర్ గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు నల్గొండలో ప్రశాంతంగా ముగిశాయని DIEO దస్రూనాయక్ తెలిపారు. 13,511 మంది విద్యార్థులకు గాను 13,143 మంది హాజరయ్యారన్నారు. 368 మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.