India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మర్రిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం <<15462226>>సర్వేయర్ రవి<<>> లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ కార్యాలయంలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ధరణిలో జరిగిన అక్రమ భూరిజిస్ట్రేషన్లపై ఆఫీసర్లు సిబ్బంది నుంచి కూపీ లాగుతున్నారు. ఆఫీస్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా RM కే.జానిరెడ్డి తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్లో కోళ్ల కళేబరాలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఇవాళ వే2న్యూస్లో వార్త పబ్లిష్ కావడంతో అలర్ట్ అయిన అధికారులు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో దేవరకొండ ఆర్డీఓ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. కాగా, ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
MG యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కే.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సేవలు అందించనున్న అరుణ ప్రియ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రిజర్వాయర్ను దేవరకొండ RDO రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. రిజర్వాయర్లో కోళ్లను ఎవరు పడేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్లో వీరి వివాహ జరిగింది.
FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. నకిరేకల్ MLA వీరేశం, పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వారు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది.
WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్లతో పాటు ఉపసంహరణల ఘట్టాలు పూర్తయ్యాయి. ఇక ప్రచారం జోరుగా సాగనున్నట్లు తెలుస్తోంది. బరిలో ఉండేవారు తేలడంతో నేటి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనున్నది.
Sorry, no posts matched your criteria.