India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు.

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలైన సైదమ్మ-వెంకటయ్య కుమార్తెలు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూతురు తేజశ్రీకి రామగుండంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఏడాది ఫీజు ₹ 1,22,000 కాగా, ఆమె అక్కకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం ఫీజు ₹ 1,88,000 చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి పనుల గుర్తింపునకు ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ఉన్న 154 ఏ4 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ టెండర్ల స్వీకరణ గడువు పొడిగించారు. కానీ ఆశావాహుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కేవలం 9 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండేళ్ల కిందట ఉన్న ఆసక్తి ప్రస్తుతం మద్యం వ్యాపారుల్లో కనిపించడం లేదని స్పష్టం అవుతుంది.

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు మంగళవారం మరో 9 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,629 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?
Sorry, no posts matched your criteria.