Nalgonda

News September 16, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

News September 15, 2024

త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి

image

త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.

News September 15, 2024

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2024

NLG: వినాయక మండపంలో విషాదం

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 15, 2024

నల్గొండ: 11 ఏళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు ఎట్టకేలకు ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 33 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. NLGలోని 17 మోడల్ స్కూళ్లలో 290 మంది, SRPT జిల్లాలో 9 మోడల్ స్కూళ్లలో 144 మంది, యాదాద్రి BNG జిల్లాలో 7 మోడల్ స్కూల్స్ ఉండగా 126 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 560 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగించింది.

News September 15, 2024

NLG: ‘ఆకతాయిలు వేధిస్తే 100కు కాల్ చేయండి’

image

స్కూల్ కాలేజీలో ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే100కు కాల్ చేయాలని షీటీం ఏఎస్‌ఐ షరీఫ్ ప్రభాకర్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓ పాఠశాలలో షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడ పిల్లలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి కేసు బుక్‌ అయితే జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతారని విద్యార్థులకు తెలిపారు.

News September 14, 2024

NLG: నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ CC TV కెమెరాలతో పాటు ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేశామని తెలిపారు.

News September 14, 2024

NLG: ‘గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి’

image

NLG జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసి రివర్, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలండి అడవిదేవుల పల్లి, కొండ భీమనపల్లి, డిండి పోలీస్ పికెట్లు, హెడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

News September 14, 2024

మదర్ డైరీ ఛైర్మన్‌గా మధుసూదన్ రెడ్డి

image

రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.