India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నార్కట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇంటి ముందున్న కారులోకి వెళ్లిన పేర్ని చరణ్య (5) ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆస్పత్రికి చేరుకుని తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నార్కట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇంటి ముందున్న కారులోకి వెళ్లిన పేర్ని చరణ్య (5) ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆస్పత్రికి చేరుకుని తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దేవరకొండలోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాదారుల సొమ్ము కాజేసి పరారైన కాంట్రాక్టు ఉద్యోగి, రాష్ట్ర ఉద్యోగ సంఘ నేతతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఐడీలతో నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం సొమ్ము భద్రంగానే ఉందని తెలిపారు. రహస్యంగా దర్యాప్తు చేస్తూ, సదరు ఉద్యోగిని పట్టుకుని మిగిలిన సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

జిల్లాలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటి పన్నుల పునఃమదింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2018లో చివరిసారిగా జరిగిన ఈ ప్రక్రియ, మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కుతోంది. ఇండ్ల కొలతలు, నిర్మాణాల్లో మార్పులు, కొత్తగా నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. 849 పంచాయతీల్లో ఈ ప్రక్రియ ద్వారా అదనంగా సుమారు రూ.2 కోట్లు ఆదాయం రానున్నది.

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని NLGలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 113 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గతంలో వీరికి సంబంధించిన ఏజెన్సీ సుమారు 99 లక్షల రూపాయల జీఎస్టీ బకాయి పడటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో స్తంభించిన వేతనాల చెల్లింపునకు ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ ద్వారా నిధులు విడుదల చేస్తూ వర్సిటీ యంత్రాంగం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.