Nalgonda

News July 9, 2024

పొంచి ఉన్న తాగునీటి గండం

image

తీవ్ర వర్షాభావంతో నాగార్జునసాగర్‌ వట్టి పోయింది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే సాగర్‌ అడుగంటుతోంది. ప్రమాదకరస్థాయిలో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి NLG, KMM జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నిండుకుంటుంది.

News July 9, 2024

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డీఎంల బదిలీ

image

నల్గొండ ఆర్టీసీ రీజియన్‌లో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌ను ఆదిలాబాద్, నిజాంబాద్, కరీంనగర్ రీజియన్ల కార్గో ఏటీఎంగా, నల్గొండ డీఎం రామ్మోహన్ రెడ్డిని మిర్యాలగూడకు, రాజేంద్రనగర్ డీఎం ఎం.శ్రీనాథ్‌ను నల్గొండకు బదిలీ చేశారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న దేవరకొండ డిపో డీఎం స్థానాన్ని టి.రమేష్ బాబుతో భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 9, 2024

కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి

image

తెలంగాణ స్టేట్‌ ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఆలేరుకి చెందిన బండ్రు శోభారాణి నియమితులయ్యారు. మార్చిలో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో బాధ్యతలు స్వీకరించలేక పోయారు. ఉద్యమ నేపథ్యం ఉన్న ఆమె 2009లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. 2023 ఎన్నికలకు ముందు రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

News July 8, 2024

భారత జట్టులో నకిరేకల్ వాసి

image

ఇండోనేపాల్ ఇంటర్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున నకిరేకల్ వ్యాయమ ఉపాధ్యాయుడు పగిడిమర్రి జాని పాల్గొన్నారు. నేపాల్‌లో ఈనెల 4 నుంచి 7 వరకు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌లో నేపాల్‌పై బంగారు పతకం సాధించారు. మిత్రులు నాగేంద్రబాబు, సైదులు, సందీప్, మహేశ్, నరేష్, జానికి అభినందనలు తెలిపారు.

News July 8, 2024

NLG: MLAతో కలిసి స్ట్మార్ట్ క్లాస్ రూంలు ప్రారంభించిన మంచు లక్ష్మి

image

భువనగిరిలోని భాగాయత్‌‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి సినీ నటి మంచు లక్ష్మీ సోమవారం ప్రారంభించారు. స్మార్ట్ క్లాస్ రూమ్‌లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

News July 8, 2024

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

image

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టూరిజం డెవలప్మెంట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టూరిజం కార్యాలయం అధికారులు, సిబ్బంది నూతన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 8, 2024

కొర్లపహాడ్ సమీపంలో ట్రామా కేర్ సెంటర్

image

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక వసతులతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించాలని ఏడీపీ ప్రతిపాదించింది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురైన సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యంతో ఈ సెంటర్ నిర్మాణం చేపడుతోంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కొర్లపహాడ్ టోల్ ప్లాజాను కీలక జంక్షన్‌గా గుర్తించిన ADP ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

News July 8, 2024

NLG: పలువురు సీఐలకు స్థానచలనం

image

జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. HYD సిటీలో వెయిటింగ్లో ఉన్న కొండల్రెడ్డిని SLG, NLGలో ఉన్న శ్రీనివాసరెడ్డిని ఐజీపీ కార్యాలయానికి, నల్లగొండ వన్ టౌన్ సీఐ సత్యనారాయణను సంగారెడ్డి వీఆర్‌కు, ఇంటలిజెన్స్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని నల్లగొండ వన్ టౌన్‌కు, HYD సిటీ వెయిటింగ్లో ఉన్న క్రాంతికుమార్‌ను NLG ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 8, 2024

NLG: నిర్మించి రెండేళ్లు.. స్థానికంగా ఉండని అధ్యాపకులు!

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి. రూ. 6.66 కోట్లతో మొత్తం 16 క్వార్టర్స్‌ను నిర్మించారు. నిర్మాణాలు పూర్తై రెండేళ్లు కావొస్తున్నా అధ్యాపకులు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది అధ్యాపకులు నిత్యం HYD నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అధ్యాపకులు స్థానికంగా ఉంటే చదువులు, పరిశోధనల పరంగా మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

News July 8, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్ 

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం దుర్గా నగర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటోలు కొని ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు.