India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
నేరడిగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్నా పొలం దగ్గర ఓ వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగలడంతో ఈ విషాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె దామరచర్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.
మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. NLG సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఆధ్వర్యంలో 33 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం మొత్తం 10,77,817 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 5,33,333 మంది, మహిళలు 5,44,429 మంది, ఇతరులు 55 మంది ఉన్నారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు SRPT SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. HYD-విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా వెళ్లాలని సూచించారు. HYD-KMM వెళ్లే వాహనాలను టేకుమట్ల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని, రూట్ మ్యాపును సిద్ధం చేశామన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ బ్యాంకు కెనాల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వారం రోజుల్లో అమరవాణి, అప్పాజీపేట దోమలపల్లి, కాకులకొండారం, నర్సింగ్ బట్ల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఉదయ సముద్రం ఎడమ కాలువ పనులను సైతం పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుర్రంపోడు మండలం మునింఖానిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ (27) మల్లేపల్లి నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ గేదెను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. NLG జిల్లాలో 33 ZPTCలు, 352 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.