India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేటలో ప్రభుత్వ టీచర్ ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాలిలా.. మామిళ్లగడ్డ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అతను భార్యతో దూరంగా ఉంటూ 2018 నుంచి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతని కన్ను ఆమె కుమార్తెలపై పడింది. వారికి మత్తు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఓసారి మహిళ చూసి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.
పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంటే.. మరోవైపు కీలకమైన రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా..? అనే దానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్పల్లి వద్ద ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
MLC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్ ముందు నుంచే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఓల్డ్ సిటీ జట్టు మొదటి బహుమతి గెలుచుకుంది. ముఖ్య అతిథిగా DSP శివరాం రెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.
పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.
Sorry, no posts matched your criteria.