India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
జిల్లాలో చిల్లర డబ్బులు దొరక్క వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో రూ.10 నోటు చలామణి తగ్గిందని, ఎక్కువగా చిరిగిన నోట్లే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో రూ. 10 నోట్ల చలామణి తగ్గిపోవడంతో అటు కొనుగోలుదారులకు, ఇటు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నా.. కొందరు వ్యాపారులు ఇవి తీసుకోవడం లేదు.
ప్రేమ వ్యవహారంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. సాహెబ్నగర్కు చెందిన శివ(22), నల్గొండ జిల్లాకు చెందిన బాలిక ప్రేమించుకున్నారు. బాలికను శివ బుధవారం సాహెబ్ నగర్కు తీసుకొచ్చాడు. బాలిక కుటుంబీకులు సాహెబ్నగర్కు రాగా ఇరు కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. శివ సోదరుడు శ్రీకాంత్ బాలిక తరఫు వ్యక్తిని కత్తితో పొడిచాడు. కేసు నమోదైంది.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయం అదేస్థాయిలో వస్తోందని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం EO భాస్కర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్లో దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా రూ.23.91 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే జూన్లో వచ్చిన
రూ.16.36 కోట్లతో పోలిస్తే ఇది రూ.7.55 కోట్లు అధికమని EO ఒక ప్రకటనలో తెలిపారు.
నాగార్జునసాగర్ తర్వాత జిల్లాలో రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం పెరుగుతోంది. మూసీ ఎగువప్రాంతాలైన HYDతో పాటు, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిరంతరం వాగులు, వంకలద్వారా వరదనీరు వచ్చి చేరుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రం వరకు రిజర్వాయర్ నీటిమట్టం 637.5 అడుగులకు పెరిగింది.
ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానాలలో ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హాస్టల్ వంటగదిని, భోజనాన్ని, టాయిలెట్లు, డైనింగ్ హాల్, విద్యార్థినుల బ్యారక్లు, బాత్రూంలను పరిశీలించారు.
హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 7 నుండి 17 వరకు మొహరం వేడుకలు జరగనున్నాయి. పట్టణంలో ప్రతి ఏడాది పెద్దఎత్తున మొహరం వేడుకలు నిర్వహిస్తారు. ఈ మొహరం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి గురువారం ముజావర్ షేక్ సైదా ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్తమ్కు దట్టీ కట్టి సన్మానించారు. కార్యక్రమంలో షేక్ మోయిన్, నాగుల్ మీరా, వల్లపుదాసు కృష్ణ, ఖాసిం, వెంకటేశ్వర్లు, రవినాయక్ పాల్గొన్నారు.
దేవరకొండ మండలంలోని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ పిల్లి వెంకటయ్య యాదవ్ మరణం బాధాకరమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆయన స్వగృహంలో భౌతికకాయన్ని సందర్శించి, కంటతడి పెట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితుడి వెంకటయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి నివాళులర్పించారు.
నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ప్రకాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిశగా పనిచేయాలని సూచించారు.
ఆగస్టు15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి, దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ 5ఏళ్లలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారన్నారు.
Sorry, no posts matched your criteria.