Nalgonda

News July 4, 2024

నల్గొండ: విద్యుత్ షాక్‌తో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి

image

కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెం గ్రామానికి చెందిన నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి(50) విద్యుత్ షాక్‌తో కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. బావి వద్ద మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. సైదిరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతికి సంబంధించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

News July 4, 2024

మూడు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

image

డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

News July 4, 2024

ముగిసిన గడువు.. ప్రత్యేక అధికారుల నియామకం

image

మండల పరిషత్‌లకు గురువారం, జిల్లా పరిషత్‌లకు శుక్రవారం గడువు ముగుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని నల్లగొండ జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ లకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక పాలన అధికారిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేశారు.

News July 4, 2024

నల్గొండ: ఆర్టీసీలో కొలువుల జాతర, తగ్గనున్న భారం

image

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 7 డిపోల్లో సుమారు 1,818 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.

News July 4, 2024

నల్గొండ సర్కిల్ పరిధిలో 10 వేల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్

image

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ NLG సర్కిల్ పరిధిలో గత ఏడాది కాలంగా 11,706 మంది రైతులు ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల సర్వీసుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 1,700 మంది రైతులు ఓఆర్సీ చెల్లించాల్సి ఉంది. మిగతా 10 వేల మంది రైతులకు వెంటనే కరెంటు కనెక్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.

News July 4, 2024

NLG: స్థానిక ప్రజాప్రతినిధులకు అందని వేతనాలు!

image

జిల్లాలో గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. జడ్పీ చైర్మన్ , జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. బుధవారంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 742 ఎంపీటీసీలు, 71 మంది ఎంపీపీలు, 71 మంది జడ్పిటిసిలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఆరు నెలలుగా వీరి వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయి.

News July 4, 2024

NLG: ప్రజల చెంత ప్రజావాణి

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ఇక నుంచి మున్సిపల్ వార్డుల్లోనూ నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. నేటి నుంచి ప్రతి గురువారం జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలతోపాటు , NLG, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL, NKL మున్సిపల్ పట్టణాల్లోని వార్డుల్లో సంబంధిత ఉద్యోగులు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు.

News July 4, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతమే!

image

వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది. దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో విత్తనాలు నాటిన తర్వాత వర్షం లేకపోవడంతో అవి ఎండిపోయే దశకు చేరాయి.

News July 4, 2024

చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఇలా..

image

చౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి NHAI రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారిపై 2.45 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లేదారి నుంచి వలిగొండ చౌరస్తా వరకు మట్టితో వంతెనను నిర్మిస్తారు. మధ్యలో ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్ల పొడవు మట్టి కట్ట కాకుండా సిమెంట్ పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.

News July 4, 2024

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: కలెక్టర్

image

హాస్టల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.