Nalgonda

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.

News February 7, 2026

NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

image

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్‌తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్‌ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.

News February 6, 2026

NLG: ప్రలోభాలను అణచివేయండి: రాణి కుముదిని

image

మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలను అణచివేయాలని, అక్రమ మద్యం, నగదు రవాణాపై ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు.

News February 6, 2026

నల్గొండ: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 6, 2026

నల్గొండ: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

News February 6, 2026

ఓటు వేయాలంటే ‘గుర్తింపు’ ఉండాల్సిందే: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం ఓటర్లు సిద్ధం కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు.

News February 6, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు ర్యాండమైజేషన్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ జి. రమేష్ సమక్షంలో కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. 270 మంది కౌంటింగ్ స్టాఫ్, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, మొత్తం 810 మంది సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

News February 6, 2026

మునుగోడు: విద్యాశాఖ అధికారులకు పట్టని గోడు

image

మునుగోడు మండలం పలివెల జడ్పీ హైస్కూల్‌లో విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడు లేకపోవడంతో బోధన పూర్తిగా నిలిచిపోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, వెంటనే టీచర్‌ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.