India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NLG జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఏటా సుమారు 5 కోట్లకు పైగానే చేపపిల్లలు వదులుతున్నారు. పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుందని అందరూ అనుకుంటున్నా జిల్లాలో నేడు కొందామంటే చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున చేపపిల్లలు ఉచితంగానే పంపిణీ చేస్తున్నా.. అందులో ఎక్కువ శాతం నాసిరకం పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్య్సకారులు తెలిపారు.

నల్గొండ పట్టణాన్ని అన్ని హంగులతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. శుక్రవారం 4, 5 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కేశరాజుపల్లి నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. నల్గొండ భవిష్యత్తును అందరం కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

జీరో ఎన్రోల్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జీరో లేదా తక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు దేశవ్యాప్తంగా ఉన్న 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉండగా.. అందులో NLG జిల్లాలో 315 నిర్వహణ లేని పాఠశాలలున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో గత కొన్నేళ్లుగా సర్కార్ స్కూళ్లను చిన్నచూపు చూస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఆకర్షణ కూడా జీరో ఎన్రోల్మెంట్ మరో కారణం.

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ అదిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. NLG మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా ఎంఆర్ వినోద్రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్ రెడ్డి, హాలియాకు నాగ సీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజుల సమయమే ఉండటంతో నాయకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో ఆయా డివిజన్, వార్డుల్లో విస్త్రత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డులలో అధికార, ప్రతిపక్షాలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం సాగుతుండడం విశేషం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.