Nalgonda

News December 30, 2024

NLG: అతడు అడవిని సృష్టించాడు

image

ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్‌ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.

News December 30, 2024

పెద్దగట్టు జాతర.. ఐదు రోజుల కార్యక్రమాలు ఇవే..

image

రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే అధికారులు జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 30, 2024

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ 

image

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఆదివారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.

News December 30, 2024

NLG: అతడు అడవిని సృష్టించాడు

image

ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్‌ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.

News December 29, 2024

NLG: న్యూ ఇయర్.. ఈ ఆలయాలకు వెళ్లొచ్చు

image

న్యూ ఇయర్ వేడుకలకు ఉమ్మడి నల్గొండ ప్రజానీకం రెడీ అవుతోంది. కొత్త సంవత్సరం రోజు ఎక్కువగా ఆలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. కాగా ఉమ్మడి జిల్లాలో మట్టంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సూర్యాపేటలో పిల్లలమర్రి శివాలయం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయాలు ఫేమస్. మీరు ఏ ఆలయానికి వెళ్తున్నారు.

News December 29, 2024

నేరాలు పెరిగాయి: NLG ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు, 100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News December 29, 2024

భువనగిరి: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్‌గూడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 29, 2024

NLG: న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్స్

image

న్యూ ఇయర్ వేడుకలకు నల్గొండ జిల్లాలో యువత సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. జిల్లా HYDకు సరిహద్దు కలిగిఉండడం, శివార్లలో ఎక్కువగా ఫాంహౌస్‌లు, రిసార్ట్స్ ఉండడంతో అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఫాంహౌసులు ఉన్నాయి.

News December 28, 2024

NLG: డిగ్రీ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం!

image

MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక, సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్య వార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును 12 ఫిబ్రవరి 2025 వరకు లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

News December 28, 2024

NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్ 

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.