Nalgonda

News December 17, 2024

గ్రూపు – 2లో నల్గొండ జిల్లా ప్రస్తావన

image

గ్రూప్- 2 పరీక్షలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. పేపర్‌-4లో ప్రశ్నలు అడగడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో జిల్లా ప్రాధాన్యం చెప్పినట్లు అయింది. SRPTలో ఏ శీర్షిక తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సు నిర్వహించింది? అని 129వ ప్రశ్నగా అడిగారు. అలాగే జతపరిచే ప్రశ్నలలో 35 ప్రశ్నగా పెద్ద గొల్లగట్టు జాతర.. లింగమంతుల స్వామి గురించి అడిగారు. 1997 BNG డిక్లరేషన్ గురించి కూడా అడిగారు.

News December 17, 2024

NLG: విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ కర్కషత్వం

image

వలిగొండ మండలం లోతుకుంట గ్రామం గల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మనికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

News December 17, 2024

‘గోవు మృతి… ఊరు మొత్తం కంటతడి’

image

మూగ జీవి మృతితో ఊరు మొత్తం కంటతడిపెట్టిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లిలోని చోటుచేసుకుంది. గ్రామంలోని శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో భక్తులు ఆలయానికి గోవును బహూకరించారు. నిత్యం గ్రామస్థులు దానిని సొంత గోమాతగా భావించి ఇంటిలో ఉన్న పదార్థాలను అందిస్తూండేవారు. 4 రోజుల క్రితం హైవేపై బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో ఊరు మొత్తం కంటతడిపెట్టి.. ఘనంగా అంత్యక్రియలు చేశారు.

News December 17, 2024

సాగర్ ఎడమ కాలువకు ఆన్-ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల

image

సాగర్ ఎడమ కాలువకు రబీ సీజన్లో ఆన్-ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్టు ఎన్ఎస్పి అధికారులు తెలిపారు. మొదటి తడి డిసెంబర్ 15 నుంచి జనవరి 11 వరకు, చివరి తడి ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కావున ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకొని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని అధికారులు సూచించారు.

News December 17, 2024

గ్రీవెన్స్‌డేతో సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు: SP

image

గ్రీవెన్స్‌డేతో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈరోజు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

News December 15, 2024

ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

image

దేశవ్యాప్తంగా 12 ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా 24 మంది లోక్‌సభ ఎంపీలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ ఎంపీ( బీజేపీ) డీకే అరుణతో పాటు భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డిని నియమించారు.

News December 15, 2024

వాజేడు SI హరీశ్ మృతి కేసులో మహిళ అరెస్ట్

image

వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు కారణమైన అనసూర్య అనే యువతిని వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియాతండాకి చెందిన ఆమె రాంగ్ నెంబర్ ద్వారా ఎస్సై హరీశ్‌కు పరిచయమై, సన్నిహిత్యం పెంచుకుందన్నారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ చనిపోయాడని పోలీసులు తెలిపారు.

News December 15, 2024

చిట్యాలలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుని వద్ద ఉద్యోగ గుర్తింపు కార్డు లభించింది. మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 15, 2024

NLG: కేంద్రాలను వెక్కిరిస్తున్న ఖాళీలు!

image

NLG జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలను ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లుగా పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు.9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో కొంత మంది పదోన్నతులు పొందగా మరికొంత మంది రిటైర్మెంట్ కావడంతో 162 టీచర్, 595 హెల్పర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

News December 15, 2024

గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలని గవర్నర్‌కు వినతి

image

తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌, ఐఎంఎ, హెన్‌ఆర్డీ పేరుతో గ్రామీణ వైద్యుల క్లినిక్‌లపై కొందరు డాక్టర్లు చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయించాలని PMP, RMP సంక్షేమ సంఘం నాయకులు కోరారు. PMP, RMP సంక్షేమ సంఘం నాయకులు శనివారం HYDలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వరరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు (నల్గొండ) పాల్గొన్నారు.