India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ బండ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ కావడం లేదు. దీంతో ఏజేన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది DEC 26 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాలో 10.07 లక్షల రేషన్ కార్డులుండగా 10.17 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, వారికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
SRPT:ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి కార్మికుడు మృతి చెందిన ఘటన హుజూర్నగర్లో చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ కెనాల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన రాంసింగ్ బఘెల్ తండ్రి మూక రాం కొలతల కోసం ముత్యాల బ్రాంచ్ కాల్వలో దిగాడు. అక్కడ అల్యూమినియం మెజర్మెంట్స్ పూర్తి చేసుకొని బయటికి వచ్చే క్రమంలో తన వద్ద ఉన్న అల్యూమినియం కరెంట్ తీగలకు తగిలి మృతి చెందాడు.
ఎంపీ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆశావహులు తమ నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. KDD, HZNR నియోజకవర్గ నేతలు మంత్రి ఉత్తమ్ ద్వారా NLG, NKL, DVK నియోజకవర్గాల నేతలు మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో పదవుల భర్తీపై స్పష్టత రానుంది.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో అధికారలు ప్రవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా ఫీజులను పెంచిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో బిక్షపతి తెలిపారు. అవసరమయితే గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.
మిర్యాలగూడలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలో బైక్ మీద నుంచి కింద పడినట్లు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి సెల్ఫోన్లను చోరీ చేశారు. పట్టణ పరిధిలో ఒక్క రోజే ఐదు ఘటనలు వెలుగు చూశాయి. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ విషయమై ఒకటో పట్టణ సీఐ సుధాకర్ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఇంటర్ విద్యతో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ కోర్సులో చేరేందుకు ఎంట్రెన్స్ పరీక్ష ఫీజును ఈనెల 17 వరకు చెల్లించాలని ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజియూ ప్లేస్మెంట్ డైరెక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు.
కోదాడకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి సీతారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వాకింగ్కి వెళ్లి వచ్చిన ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. వైద్యశాలకు తరలించే లోపు ఆయన కన్నుమూశారు. కాగా ఆయన భార్య అనురాధ గుడిబండ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సీతారెడ్డి మృతి పట్ల విద్యుత్, విద్యాశాఖ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐ.టి.ఐ.లలో అడ్మిషన్ల కోసం మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఐ.టి.ఐ కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.గోపాల్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు http://iti.telangana.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రికి 25 ఏళ్లు జైలుశిక్షను విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ మహిళా జడ్జి శ్యామ్శ్రీ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. గతేడాది ఫిబ్రవరి 23న మద్యం మత్తులో సంపత్ కుమార్ తన కూతురిపై అత్యాచారం చేశాడు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తీర్పు వెలువడింది.
Sorry, no posts matched your criteria.