Nalgonda

News December 7, 2024

నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణవెల్లంలకు చేరుకుంటారు. 2.40 గంటలకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. 3.20గంటలకు యాదాద్రి ధర్మల్ పవర్ యూనిట్ -2 శక్తివంత స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజ్‌ని ప్రారంభిస్తారు. 5-6 గంటలకు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.

News December 6, 2024

సీఎం రేవంత్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

image

దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాగా పర్యటన ఏర్పాట్లను మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు మంత్రులు తగిన సూచనలు చేశారు. 

News December 6, 2024

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు

image

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News December 6, 2024

NLG: ముగిసిన జీఎన్ఎమ్ పరీక్షలు

image

NOV 25న ప్రారంభమైన GNM పరీక్షలు గురువారంతో ముగిశాయని నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణ పర్యవేక్షణలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News December 6, 2024

NLG: ఆయిల్ పామ్‌పై పెరుగుతున్న ఆసక్తి!

image

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదిలో రెండింతల సాగు పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు రాయితీలు ఇస్తోంది. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారించారు.

News December 6, 2024

సూర్యాపేట: తలపై బండరాయితో కొట్టి చంపేశారు

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి (M)లో వ్యక్తిని <<14800753>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసులు, తండావాసుల వివరాల ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన పాచ్యానాయక్(32) లారీ డ్రైవర్‌. కాగా, నిన్న సుల్తాన్‌పూర్ తండా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. గ్రామానికి చెందిన కొందరితో పాచ్యాకు భూవివాదాలు ఉన్నాయని, గొడవలు జరిగాయని, వారే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదైంది.

News December 6, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ. 9గం.లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డూ, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News December 5, 2024

ఎస్సై ఆత్మహత్య.. ఇన్‌స్టా అమ్మాయే కారణం!

image

ములుగు(D) వాజేడు SI హరీశ్‌కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్‌కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.

News December 5, 2024

చిట్యాల: మహిళను కొట్టి పుస్తెలతాడు అపహరణ

image

ఇంట్లోకి ఇద్దరు చొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు.

News December 5, 2024

కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

image

గ్రామస్థాయి స్థానిక సంస్థలలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి, నియమ నిబంధనల ప్రకారం 2025- 26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె జడ్పీ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.