Nalgonda

News December 20, 2024

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ.9గం.లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News December 19, 2024

NLG: ‘ఇందిరమ్మ’ సర్వేను వెంటాడుతున్న సమస్యలు

image

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ సతాయింపుతో పాటు.. గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు సమస్యగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 67 వేల ఇండ్లను మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సర్వేను సమస్యలు వెక్కిరిస్తున్నాయి.

News December 19, 2024

మిర్యాలగూడ: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ మృతికి కారణమైన నిందితుడికి మిర్యాలగూడ ఐదో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మిర్యాలగూడ మండలం జైత్రాంతండాకు చెందిన సైదులు లక్ష్మమ్మను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. అప్పటి మిర్యాలగూడ ఎస్‌ఐ కేసు నమోదు చేయగా.. సీఐ రమేశ్ మాబు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.

News December 19, 2024

కష్టపడి కాకుండా ఇష్టంతో చదవండి: దశ్రు నాయక్

image

చింతపల్లి మండల కేంద్రంలోని డా. ఆలూకా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిఐఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ఫలితాలకై అధ్యాపకులు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలలో మెరుగైన ఫలితాలు రావాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఆయన వెంట అధ్యాపకులు ఉన్నారు.

News December 19, 2024

NLG: ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి

image

ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 18, 2024

దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర ఎప్పుడంటే..?

image

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. 2025 ఫిబ్రవరి 2న దిష్టి పూజ నిర్వహించి, 16 నుంచి 20వ తేదీ వరకు జాతర నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తారు.

News December 18, 2024

మహాలక్ష్మీ పథకానికి అప్లై చేసుకోండి: కలెక్టర్ త్రిపాఠి 

image

తెల్లరేషన్ కార్డు ఉండి మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి గతంలో అప్లై చేయని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దరఖాస్తుతో పాటు, ఎల్పీజీ వినియోగదారు నంబరు, ఆధార్ కార్డు వివరాలు, జిరాక్స్, ఎల్పీజీ గుర్తింపు ధ్రువపత్రాలతో అప్లై చేయాలన్నారు. 

News December 17, 2024

గ్రూపు – 2లో నల్గొండ జిల్లా ప్రస్తావన

image

గ్రూప్- 2 పరీక్షలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. పేపర్‌-4లో ప్రశ్నలు అడగడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో జిల్లా ప్రాధాన్యం చెప్పినట్లు అయింది. SRPTలో ఏ శీర్షిక తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సు నిర్వహించింది? అని 129వ ప్రశ్నగా అడిగారు. అలాగే జతపరిచే ప్రశ్నలలో 35 ప్రశ్నగా పెద్ద గొల్లగట్టు జాతర.. లింగమంతుల స్వామి గురించి అడిగారు. 1997 BNG డిక్లరేషన్ గురించి కూడా అడిగారు.

News December 17, 2024

NLG: విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ కర్కషత్వం

image

వలిగొండ మండలం లోతుకుంట గ్రామం గల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మనికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

News December 17, 2024

‘గోవు మృతి… ఊరు మొత్తం కంటతడి’

image

మూగ జీవి మృతితో ఊరు మొత్తం కంటతడిపెట్టిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లిలోని చోటుచేసుకుంది. గ్రామంలోని శంభులింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ సమయంలో భక్తులు ఆలయానికి గోవును బహూకరించారు. నిత్యం గ్రామస్థులు దానిని సొంత గోమాతగా భావించి ఇంటిలో ఉన్న పదార్థాలను అందిస్తూండేవారు. 4 రోజుల క్రితం హైవేపై బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో ఊరు మొత్తం కంటతడిపెట్టి.. ఘనంగా అంత్యక్రియలు చేశారు.