India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.

దేవరకొండ: మద్యం మత్తులో 100కు డయల్.. ఏమైందంటే..
నల్గొండ: ఎన్జీ కళాశాలలో ముగిసిన జాతీయ సదస్సు
నార్కట్పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
నల్గొండ: పురపోరుకు ఎర్రజెండా సైన్యంసై
నార్కట్ పల్లి: చెరువుగట్టు జాత తేదీల ప్రకటన
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా పెరిగిన నిఘా
మిర్యాలగూడ : కొత్తగా మిర్యాలగూడ జిల్లా?
నల్గొండ : నాలుగు నెలలు ఆగాల్సిందే..
నల్గొండ : తెరపడిన మదర్ డెయిరీ వివాదం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల భవనాల స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వార్డు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో 7 మున్సిపాలిటీల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దె భవనాల భారం తగ్గించి, ప్రభుత్వ భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

చెరువుగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ నెల 23 నుంచి 30 వరకు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు జరగనున్నందున శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల, TDDCF ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు హోటళ్లు, దాబాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీల నుంచి ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతి వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.