Nalgonda

News December 17, 2024

సాగర్ ఎడమ కాలువకు ఆన్-ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల

image

సాగర్ ఎడమ కాలువకు రబీ సీజన్లో ఆన్-ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్టు ఎన్ఎస్పి అధికారులు తెలిపారు. మొదటి తడి డిసెంబర్ 15 నుంచి జనవరి 11 వరకు, చివరి తడి ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కావున ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకొని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని అధికారులు సూచించారు.

News December 17, 2024

గ్రీవెన్స్‌డేతో సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు: SP

image

గ్రీవెన్స్‌డేతో బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈరోజు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

News December 15, 2024

ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

image

దేశవ్యాప్తంగా 12 ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా 24 మంది లోక్‌సభ ఎంపీలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కి పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ ఎంపీ( బీజేపీ) డీకే అరుణతో పాటు భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డిని నియమించారు.

News December 15, 2024

వాజేడు SI హరీశ్ మృతి కేసులో మహిళ అరెస్ట్

image

వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు కారణమైన అనసూర్య అనే యువతిని వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియాతండాకి చెందిన ఆమె రాంగ్ నెంబర్ ద్వారా ఎస్సై హరీశ్‌కు పరిచయమై, సన్నిహిత్యం పెంచుకుందన్నారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ చనిపోయాడని పోలీసులు తెలిపారు.

News December 15, 2024

చిట్యాలలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుని వద్ద ఉద్యోగ గుర్తింపు కార్డు లభించింది. మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 15, 2024

NLG: కేంద్రాలను వెక్కిరిస్తున్న ఖాళీలు!

image

NLG జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలను ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లుగా పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు.9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో కొంత మంది పదోన్నతులు పొందగా మరికొంత మంది రిటైర్మెంట్ కావడంతో 162 టీచర్, 595 హెల్పర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

News December 15, 2024

గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలని గవర్నర్‌కు వినతి

image

తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌, ఐఎంఎ, హెన్‌ఆర్డీ పేరుతో గ్రామీణ వైద్యుల క్లినిక్‌లపై కొందరు డాక్టర్లు చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయించాలని PMP, RMP సంక్షేమ సంఘం నాయకులు కోరారు. PMP, RMP సంక్షేమ సంఘం నాయకులు శనివారం HYDలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వరరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు (నల్గొండ) పాల్గొన్నారు.

News December 14, 2024

NLG: మామపై దాడి.. కోడలికి రిమాండ్ 

image

వృద్ధుడు, దివ్యాంగుడైన మామపై <<14828145>>చెప్పుతో దాడి<<>> చేసిన ఘటనలో అతని కోడలిని రిమాండ్‌కు తరలించినట్లు వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 20న భూ వివాదంలో శెట్టిపాలెంకి చెందిన గగినపల్లి బుచ్చిరెడ్డిపై అతడి కోడలు మణిమాల చెప్పుతో దాడి చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి మణిమాలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు.

News December 14, 2024

తెలంగాణ- ఆంధ్ర చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు 

image

కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో ఆంధ్ర – తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు బోనస్ ధర ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు. 

News December 13, 2024

భువనగిరి ఒక్కటే మిగిలింది!

image

త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.