India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.
డీఈఈ సెట్ 2024 సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమవుతుందని NLG డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. NLG డైట్ కళాశాలలో 5న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు ర్యాంకుల ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 13వ తేదీన సీట్ల కేటాయించనున్నామని తెలిపారు. సీటు పొందిన వారు 13 నుంచి 17వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూర్యాపేట, అంజనపురి కాలనీ, మునగాల, నకిరేకల్, చౌటుప్పల్, మిర్యాలగూడ, కొదాడ, ఏన్కూర్, భువనగిరి, ఆత్మకూరు, సిరికొండ, పానగల్, తిరుమలగిరి పలు చోట్ల భూమి కంపించింది. ఉదయం 7:30 గంటలకు 3 సెకన్ల కంపించినట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ ప్రాంతంలోనూ భూమి కంపించిందా? కామెంట్ చేయండి.
త్వరలో నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంగళవారం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో హెలిప్యాడ్ స్థలాన్ని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్. వెంకటేశ్వర రావు, ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబరు 3నుండి 9వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోస్టర్లను విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అవినీతి రహిత సమాజం ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. రాష్ట్ర సీఎం కలలుగన్న బంగారు తెలంగాణకు అవినీతి రహిత సమాజం దారి చూపుతుందని ఉద్ఘాటించారు. ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని తీన్మార్ మల్లన్న కలిసి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తయితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఎవరెంతో వాళ్లకు అంత వాటా అన్ని రంగాలలో దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బండిని కలిసిన వారిలో పిల్లి రామరాజు, వట్టే జనయ్య, తమ్మడ బోయిన అర్జున్ తదితరులు ఉన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నానని.. కాలేజీ యజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్టూడెంట్ చెప్పింది. కాగా ఆమె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినిని కలెక్టర్ తేజస్ నందలాల్ పరామర్శించారు.
సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ యాక్ట్లో కొన్ని మార్పులు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగింపు. సర్పంచ్ అవ్వాలనుకున్నవారు పోటీ చేసే అవకాశం రాకపోతే కనీసం ఉప సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం చెక్ పవర్ తొలగింపు నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి NLG జిల్లాలో సర్పంచ్ పదవి కోరుకునే వారికి ఇంట్రస్ట్ ఉంటుందా.. మీరేమంటారు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ఆమోదించిన ప్రజా పాలన విజయోత్సవాల అధికారిక లోగోను అన్ని ప్రింట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఉపయోగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజా పాలనపై సమీక్షించారు.
ఫిర్యాదుదారులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అనవసరంగా కాలయాపన చేయకుండా ఫిర్యాదులు పరిష్కరించాలని అన్నారు
Sorry, no posts matched your criteria.