India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెంను ఫిబ్రవరి 10 వరకు ఖాళీ చేయాలని ఇరిగేషన్ డీఈ కాశీం గ్రామస్థులకు సూచించారు. గురువారం సమావేశం నిర్వహించి వారికి వివరించారు. తమకు పూర్తి నష్ట పరిహారం, R&R ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
చిన్నపిల్లలు, మహిళల సంరక్షణ బాధ్యత పూర్తిగా మహిళ, శిశు సంక్షేమ శాఖతో పాటు జిల్లా యంత్రాంగంపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణ, పాత అంగన్వాడి కేంద్రాల మరమ్మతులు, తదితర అంశాలపై ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు ఆధ్వర్యంలో యుటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేయవచ్చని ప్రయాణికులకు సూచించారు. ఈ అవకాశాన్ని ప్యాసింజర్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శాలిగౌరారం మండలం <<15238534>>ఉప్పలంచ మాజీ సర్పంచ్<<>> బండారు మల్లయ్య<<15212850>> హత్య కేసులో<<>> ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘పాత కక్షలతో ఈ నెల 21న మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను మృతిచెందాడు. 12 మందిని నిందితులను గుర్తించి ఏడుగురిని అరెస్టు చేశాం. మిగతా ఐదుగురిని త్వరలో పట్టుకుని రిమాండ్ కు పంపుతాం’ అని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
గుర్రంపోడు మం. లక్ష్మీదేవిగూడెంలో ట్రాన్స్ కో ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన మహిళకు రిమాండ్ విధించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాలిలా.. 400 కేవీ లైన్ పనులను ఆపాలని లేకుంటే చస్తానని పద్మ అనే బెదిరించింది. దీంతో AD వీరస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ పురుగుమందు తాగబోగా హోంగార్డు సుజాత్ ఆపడానికి ట్రై చేశారు. ఆమె చేయి కొరకగా మహిళను రిమాండ్ చేసినట్లు SI మధు తెలిపారు.
దేశంలోని ఆర్టీసీలలో అతి తక్కువ శాతం ప్రమాదాలు తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఉన్నాయని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్గొండ డిపో గ్యారేజ్లో ఉమ్మడి నల్లగొండ ఆర్ఎం కె. జానిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ భద్రత మాసోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. ఏ సీజన్లోనైనా కష్టపడి డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేస్తున్నారని, డ్రైవర్లు దేవుళ్లతో సమానమని అన్నారు. డ్రైవర్లు స్పీడ్ కంట్రోల్ చేసుకొని నడపాలన్నారు.
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన వారి స్పృత్యర్థం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాటి చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన నల్గొండ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాములబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు వెంకన్న గురువారం మధ్యాహ్నం స్థానిక క్రషర్ మిల్లు వద్ద ఉన్నతాటి చెట్లకు లొట్లు కట్టేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుని గురించి భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో గుడి కట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాగా నేడు గాంధీ వర్ధంతి.
నాగార్జున సాగర్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
Sorry, no posts matched your criteria.