India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో యాసంగి వరి సాగు ఊపందుకుంది. నాన్ ఆయకట్టులో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావచ్చాయి. ఆయకట్టు పరిధిలో వరినాట్లు కొనసాగుతున్నాయి. రైతులంతా సీజన్లో వరి సాగు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగైనట్లు అధికారుల అంచనా. ఫిబ్రవరి నాటికి జిల్లాలో వరి నాట్ల సాగు పూర్తి కానున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు, అలాగే మార్చి 5 నుంచి మార్చి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల పోస్టర్ను ఆయన సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 9వరకు మండల స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు.
నల్గొండకు మంగళవారం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు BRS పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నల్గొండకు చేరుకుంటారన్నారు. క్లాక్ టవర్ వద్ద జరిగే రైతు మహాసభలో ఆయన పాల్గొంటారన్నారు. కాగా, కోర్టు అనుమతితో రేపు నల్లగొండలో రైతు మహాధర్నాను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్గొండలో పాల్గొనే ధర్నా కార్యక్రమం ఏర్పాట్లను క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డిలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి పాల్గొన్నారు.
పాతబడిన అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె జిల్లా అధికారుల సమ్మిలిత సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించిన రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలన్నారు.
NLG జిల్లాలోని మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా కొనసాగనున్నారు. కాగా నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఉండటంతో యథావిధిగా కొనసాగనుంది.
కిడ్నీ రాకెట్ ఘటనలో నల్గొండ పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో అరెస్టైన వారిలో నల్గొండకు చెందిన నలుగురు మెడికల్ అసిస్టెంట్లు ఉండడం చర్చనీయాంశం అయ్యింది. NLGకు చెందిన రమావత్ రవి, సపావత్ హరీశ్, సపావత్ రవీందర్, పొదిల సాయి అరెస్టైన వారిలో ఉన్నారు. కాగా.. 2016లో ఈ తరహా ఘటన నల్గొండలో జరగ్గా.. ఇప్పుడు కూడా నల్గొండ వాసులు ఉండడం నివ్వెర పరుస్తోంది.
నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో 10,374 కుటుంబాలకు చెందిన 41,922 మందికి స్కీమ్స్ అందజేసింది. అందులో 713మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,976 మందికి కొత్త కొత్త రేషన్ కార్డులు, 4,677 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్స్ కాపీలు అందజేశారు. అత్యధికంగా రైతు భరోసాకు 31,556 మంది ఎంపికయ్యారు.
శౌర్యచక్ర అవార్డు గ్రహీత కుక్కుడుపు శ్రీనివాస్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరించి గ్రామం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. శ్రీనివాస్ సాధించిన ఈ ఘనత తమ గ్రామం పేరును నిలబెట్టిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు ఆయనను అభినందించారు.
Sorry, no posts matched your criteria.