Nalgonda

News May 30, 2024

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్ధులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

పెద్దవూర: సాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకుగాను 504.70 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలకుగాను ప్రస్తుతం 122.8483 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News May 30, 2024

NLG: సీఎంఆర్ ఆఖరి గడువు జూన్ 15?

image

ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం తీసుకొని బియ్యం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై పీడీ యాక్టు లాంటి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వానాకాలం 2023-24 సీఎంఆర్ తో పాటు బకాయిపడిన బియ్యాన్ని జూన్ 15 వరకు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనాధికారి హెచ్చరించినట్లు తెలుస్తుంది. బకాయి బియ్యం ఇవ్వకుంటే మిల్లర్లపై పిడి యాక్ట్ పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

News May 30, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఇద్దరు సూసైడ్

image

మిర్యాలగూడ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మృతులు మిర్యాలగూడ మం. వెంకటాద్రిపాలెం దురనగర్ వాసులుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 30, 2024

ఎన్నిక ఏదైనా భువనగిరి ఫస్ట్

image

ఉద్యమాల గడ్డ యాదాద్రి భువనగిరి. ఎన్నిక ఏదైనా అదే చైతన్యాన్ని చాటుతూ.. ఓటింగ్‌లోనూ తామే సాటి అని నిరూపిస్తూ రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తోంది ఈ జిల్లా. WGL-KMM-NLG పట్టభద్రుల అసెంబ్లీ స్థానాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 జిల్లాలు వస్తాయి. 11 జిల్లాలను తలదన్ని యాదాద్రి జిల్లా 78.59 శాతం ఓట్లతో అగ్రస్థానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లోనూ భువవనగిగే అగ్రస్థానం.

News May 30, 2024

నల్గొండ: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 29, 2024

నల్గొండ: ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. తీవ్ర ఉత్కంఠ

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

News May 29, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి యువకుడి సూసైడ్ 

image

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మిర్యాలగూడ వాసిగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News May 29, 2024

NLG: ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నం విష్ణువర్ధన్ తన తండ్రి ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చొన్నాడు. రేగట్టే గ్రామం వైపు వెళుతుండగా కోమటికుంట కట్టపై ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడిండి. ట్రాక్టర్ కిందపడిన విష్ణువర్ధన్ ఘటనా స్థలంలోనే మరణించాడు.