Nizamabad

News June 26, 2024

NZB: చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ కుంట శివారులో మంగళవారం రాత్రి రోడ్డుపై  వెళ్తున్న కారుకు చిరుత అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.

News June 26, 2024

నిజామాబాద్‌‌లో దారుణ హత్య.. వివరాలు ఇవే!

image

నిజామాబాద్‌లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

News June 26, 2024

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు

image

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంతో కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో గుండె సంబందిత శస్త్ర చికిత్సలు, రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, యూరాలజీతో పాటు న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News June 26, 2024

NZB: పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: రాష్ట్ర కార్యదర్శి కరుణ

image

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి ప్రాథమిక విద్యకేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు.

News June 25, 2024

NZB: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం రీకౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు జులై 1 లోపు ఫీజు చెల్లించాలని సూచించింది. ఒక్కో పేపర్ రివాల్యుయేషన్‌కు రూ.500 చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు.

News June 25, 2024

NZB: ‘బదిలీలు పారదర్శకంగానే జరిగాయి’

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల బదిలీల్లో పైరవీలు జరుగుతున్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై సీపీ కార్యాలయ యంత్రాంగం స్పందించింది. పత్రికల్లో కథనాలు వచ్చిన విధంగా ఎక్కడ అలా జరగలేదు. ఇప్పటి వరకు బదిలీలు పూర్తిస్థాయి పారదర్శకంగా జరిగాయి. మెరిట్ ఆధారంగా మాత్రమే బదిలీలు జరిగాయని ఏదో రకంగా ఊహించుకుని రాయడం పద్ధతి కాదని ఓ ప్రకటనలో పేర్కొంది.

News June 25, 2024

నిజాంసాగర్ ప్రాజెక్ట్ అప్డేట్

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధాన కాలువకు 1,037 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వెళ్తోంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1390.33 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.176 టీఎంసీలుగా ఉందని ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.

News June 25, 2024

కామారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నారా గౌడ్ తెలిపారు. పాఠశాలలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈనెల 29 లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News June 25, 2024

నిజామాబాద్‌లో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

image

నిజామాబాద్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

News June 25, 2024

కామారెడ్డిలో టమాట@ రూ.100

image

కామారెడ్డిలో రోజురోజుకి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర రూ.100, పచ్చిమిర్చి రూ.120, కొత్తిమీరు రూ.150, పాలకూర రూ.80 బీరకాయలు రూ.120, క్యాప్సికం రూ.120 క్యాబేజి రూ.80 పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.