Nizamabad

News December 13, 2024

నేడు ఉమ్మడి NZB జిల్లాకు మంత్రుల రాక..

image

ఉమ్మడి NZB జిల్లాలో శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

News December 13, 2024

నేడు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు మంత్రి ఉత్తమ్ రాక

image

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్ కు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

News December 13, 2024

కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ సురేష్ శెట్కార్

image

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లిన సీఎం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, సింగరేణి బొగ్గు గనులు, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో సీఎం చర్చించారు. కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఉన్నారు.

News December 12, 2024

NZB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

News December 12, 2024

మెండోరా: ఏడాదిగా మూసి ఉన్న ATM

image

మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.

News December 12, 2024

NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్

image

నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.

News December 12, 2024

బోధన్‌లో విద్యుత్తు అధికారుల పొలంబాట

image

బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్త్యార్ హైమద్ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఈ నాగేష్ కుమార్, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News December 11, 2024

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు.లబ్ధిదారుల భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.

News December 11, 2024

NZB: చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలు

image

నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో ఇవి ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

News December 11, 2024

NZB: UPDATE.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్‌కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.