India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకవర్గం లేని కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (BLTU) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు రావడం లేదని, వారికి సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలడం లేదన్నారు. దీనితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో కదలిక మొదలయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2BHK కోసం అర్హులను ఎంపిక చేసేందుకు విచారణ జరుపుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 19,397 ఇండ్లు లక్ష్యానికి 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 9,486 మార్కింగ్ పూర్తి అయ్యాయి. ఇందులో NZB (U) 900, NZB (R) 502, బాల్కొండ 1176, బోధన్ 1553, బాన్సువాడ 4807, ఆర్మూర్ 548 ఇండ్లు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా జిల్లాకు 67,529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇందులో మంగళవారం వరకు 62,254 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు. 5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత 2024 వానాకాలం సీజన్లో జిల్లాలో 68,244.8 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు హైదరాబాద్లో యువ తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ లీగ్ కోసం రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ ‘శాతవాహన సైనిక’ జట్టుకు చీఫ్ కోచ్గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కబడ్డీ కోచ్గా పని చేస్తున్నారు.
జల్సాలకి అలవాటు పడి తెలంగాణ, మహారాష్ట్రల్లో ద్విచక్ర వాహనాలు చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు NZB ACP రాజా వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితులు బోధన్కు చెందిన షేక్ ఇలియాస్, షేక్ సమీర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్ రియాజ్@ అరబ్@ అర్షద్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
NZB జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపి కలెక్టర్ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.
NZB టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నం చేసి పరారైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని, ఏటీఎం సెంటర్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం పరిశీలించారు. ఎస్సై హరిబాబు, సీఐ శ్రీనివాస్ రాజుకు సూచనలు చేశారు. వీలైనంతవరకు త్వరగా నేరస్థులను పట్టుకోవాలని ఆదేశించారు.
పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులు ఎవరైనా పంటలు సాగు చేస్తుంటే వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. వారు పంటలు వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా ఇతర ఎరువుల కొరత లేదన్నారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరొకొంత సేపట్లో వరద గేట్ల ద్వారా 3.5 లక్షల క్యూసెక్కుల వరదను గోదావరిలోకి వదల బోతున్నట్లు SE వి.జగదీశ్ తెలిపారు. గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువుల, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దన్నారు.
NZB పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేశారు. ఒకే రోజులో ఏకంగా 14 మందిపై బదిలీ వేటు వేశారు. CI అంజయ్యను CCRBకి, SI గోవింద్ ఆర్మూర్, శివరాం CCRBకి అటాచ్ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డి, లస్మన్న, సుధీర్, అనిల్ కుమార్, రాజు, సచిన్, అన్వర్, అనిల్, శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథ్ను వివిధ పోలీస్ స్టేషన్లు, ARకు అటాచ్ చేశారు.
Sorry, no posts matched your criteria.