India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో రైతు సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. రైతు రుణమాఫీ కింద 97,696 మంది రైతుల పంట రుణాలు రూ.755.29 కోట్లు మాఫీ అయ్యాయి. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద 2,72,589 మంది రైతుల ఖాతాల్లో రూ.316 కోట్లు జమ చేశారు. రైతు బీమా ద్వారా 966 మంది రైతుల కుటుంబాలకు రూ.48.30 కోట్లు అందాయి. ఇలా మొత్తం మీద రైతులకు రూ.1,119 కోట్లకు పైగా ప్రయోజనం లభించింది.
నిజామాబాద్ జిల్లాలో వానాకాలం-2025 సీజన్లో రైతులు 5.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 4.19 లక్షలు, మొక్కజొన్న 52 వేలు, సోయా చిక్కుడు 33 వేలు, పసుపు 23 వేల ఎకరాలు ఉన్నాయి. దీనికోసం ఇప్పటివరకు యూరియా 59,236, డీఏపీ 11,385 మెట్రిక్ టన్నులు వాడారు. అత్యవసర పరిస్థితుల కోసం 1,746 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్లో ఉంచారు.
స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25లో 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు రూ. 63.11 కోట్లు రుణాలు మంజూరు చేశారు. 2025-26లో రూ. 1,228.50 కోట్లు లక్ష్యం కాగా, ఆగస్టు 11 నాటికి 4,300 సంఘాలకు రూ. 357.41 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనితీరు జిల్లాలో మహిళా సాధికారతకు నిదర్శనం.
నిజామాబాద్లోని మహాలక్ష్మినగర్ నాగాటవర్స్లో నివాసం ఉంటున్న విఠల్ ఇంట్లో భారీచోరీ జరిగింది. బాధితుల వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున విఠల్ కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీ గుండా ప్రవేశించి బెడ్ రూంకు గడియ పెట్టారు. మరో బెడ్ రూంలోని బీరువాను పగులగొట్టి 12 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్హెచ్-44, ఎన్హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇక జనవరి నుంచి పౌర సరఫరా రంగంలో 11,852 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని అధికారులు తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,19,330 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ప్రభుత్వం రూ.30.73 కోట్ల సబ్సిడీ అందించిందని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్హెచ్-44, ఎన్హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.
మైనారిటీ సంక్షేమానికి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 53 చర్చిల నిర్మాణం, వాటి ప్రహరీ గోడల పనులకు రూ.7.18 కోట్లు కేటాయించారు. అలాగే, 53 ఉర్దూ ఘర్ కం-షాదీఖానాల నిర్మాణ పనులకు రూ.7.85 కోట్లు పరిపాలన మంజూరు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నిధులు జిల్లాలోని మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనున్నాయని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.
నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.
Sorry, no posts matched your criteria.