Nizamabad

News September 15, 2024

భీంగల్‌: నేడు మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

image

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నేడు తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీ అధ్యక్షుడిగా భీంగల్‌కు చెందిన బొమ్మ మహేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరి నేడు ఉన్నత పదవీ(పీసీసీ) చేపట్టడం చాలా గొప్ప విషయం అని పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నారు.

News September 15, 2024

గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్

image

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News September 14, 2024

NZB: గణేశ్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

News September 14, 2024

బాల్కొండ: మిస్ అయిన బాలుడి హత్య..!

image

నాలుగు రోజుల క్రితం మిస్ అయిన బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి కచ్చు రాకేష్ (12) మృతదేహం శనివారం బాల్కొండలోని పురాతన ఖిల్లా వద్ద హత్యకు గురైన స్థితిలో లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లక్మయ్యల కుమారుడైన రాకేశ్ 4 రోజుల క్రితం అదృశ్యమవగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News September 14, 2024

కామారెడ్డి: జిల్లా అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు

image

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ 2024లో నిర్వహించిన పోటీలలో లింగంపేట మైనారిటీ గురుకుల కళాశాల ఎంపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు కె. నితిన్, ఎస్‌డీ జునైద్ గోల్డ్ మెడల్ సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఏ. మధుసూదన్ రావు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను సన్మానించారు.

News September 14, 2024

NZB: కాకతీయ కాలువ పరివాహక ప్రాంత ప్రజలకు గమనిక

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ (LMD పైన) పరివాహక ప్రాంత ప్రజలకు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజనీర్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరిక జారీ చేశారు. కాకతీయ కాలువలో నీటి ప్రవాహం తిరిగి మొదలైనందున కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. కనుక కాల్వ దరిదాపుల్లోకి ప్రజలు ఎవరూ రావద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 14, 2024

రాష్ట్ర వ్యవసాయ సలహాదాడిగా బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన బాన్సువాడ MLA పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. HYD నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని హార్టికల్చర్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొని పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 14, 2024

దోమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

రోడ్డు ప్రమాదం ఇద్దరి స్నేహితుల కుటుంబాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన జొన్నల రాము(23), ముత్తి రమేశ్(24))లు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న వినాయకుడి పూజా సామగ్రి కోసం బైక్‌పై కామారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద వీరి వాహనాన్ని మరో బైక్‌ ఢీకొట్టింది.

News September 14, 2024

కామారెడ్డి: ముమ్మరంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో గల శాఖరి కుంటలో కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు సులువుగా వెళ్లేందుకు రహదారిని చదును చేసి, విద్యుత్ దీపాలను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యనిర్వహణ అధికారి మహేశ్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

News September 14, 2024

నేడు బాధ్యతలు స్వీకరించనున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం

image

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా నియమితులైన విషయం తెలిసిందే. కాగా, నేడు ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని హార్టీకల్చర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉమ్మడి NZB మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు.