India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. శనివారం రాత్రి 29,443 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం ఉదయం 10 గంటలకు 31,202 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 3,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వాటిలో కాకతీయ కెనాల్కు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను ప్రస్తుతం 53.620 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి నుండి మరింత బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాలలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి ఖచ్చితంగా 200 సభ్యత్వం చేయాలని సూచించారు.
* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని వారు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరికి గురైనట్లు పేర్కొన్నారు.
కొడుకును చంపిన తండ్రికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NZB జిల్లా జడ్జి సునీత శక్రవారం తీర్పునిచ్చారు. నవీపేట్ మం. మోకాన్పల్లికి చెందిన కిషన్ గతేడాది రూ.9 లక్షలకు పొలం అమ్మాడు. డబ్బులు కావాలని కొడుకు శ్రీకాంత్ అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 14న శ్రీకాంత్ తన తండ్రి ఫోన్ తీసుకోవడంతో అతడిపై కిషన్ కర్రతో దాడి చేసి చంపేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల పశువులు, జనాలపై చిరుతల దాడులు పెరిగాయి. NZB, ఇందల్వాయి, వర్ని, రేంజల్ పరిధిలో గడిచిన మూడేళ్లలో చిరుతల సంఖ్య 80 వరకు పెరిగింది. కాగా ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సౌత్ రేంజ్ ఇన్ఛార్జ్ అధికారి రవిమోహన్ సూచించారు.
ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్ఛార్జ్గా కండెల సుమన్ను నియమిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ లేఖలో వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రీజియన్లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు విశారధన్ మహారాజ్కు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి వివేకానంద కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీలలో దొంగలు బీభత్సం సృష్టించారు, 9 ఇండ్లలో బంగారం, వెండి, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు వరకు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరిలోకి వెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.