Nizamabad

News September 26, 2024

NZB: ట్రైనీ SIలను అభినందించిన CP

image

హైదరాబాద్‌లో 1 సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకొని నిజామాబాద్ జిల్లాలో బుధవారం రిపోర్టు చేసిన ట్రైనీ ఎస్సైలు పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్వర్, కిరణ్ పాల్, శైలెందర్, సుస్మిత, రమ, సుహాసిని, కళ్యాణిను ఆయన అభినందించారు. ఆయనతో పాటు అదనపు డీసీపీ కోటేశ్వరావు, తదితరులు ఉన్నారు.

News September 25, 2024

పిట్లం: పింఛన్ ఇప్పించండి మేడం.. వృద్ధురాలి ఆవేదన

image

పిట్లంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బుధవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పిట్లం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇదే సమయంలో అక్కడే అన్న వాలీబాయి అనే వృద్ధురాలు సబ్ కలెక్టర్‌తో ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి ఆధారం లేదని, కనీసం పింఛన్ ఐనా ఇప్పించండి మేడం అని తన బాధను వెల్లబుచ్చింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఆమెకు పించన్ ఇప్పించాలని ఎంపీడీవోకు ఆదేశించారు.

News September 25, 2024

NZB: ప్రేమ నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెందిన 21 ఏళ్ల యువకుడు ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 10న పురుగుల మందు తగగా NZBలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

News September 25, 2024

NZB: ఇద్దరు మత్స్యకారులు మృతి

image

నవీపేట, సాలూరా మండలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. నవీపేట మండల మహంతానికి చెందిన భూమన్న స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా కాళ్లకు వల చుట్టుకుని చనిపోయాడు. సాలూర మండలం హున్నాకు చెందిన సాయిలు మందర్న శివారులోని రాంసాలకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి వలకు చుట్టుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News September 25, 2024

కామారెడ్డిలో నూతన ఎంఈఓలు వీరే

image

కామరెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి-దేవేందర్ రావు, లింగంపేట్-షౌకత్, బీర్కూర్-వెంకన్న, జుక్కల్-తిరుపతయ్య, రాజంపేట్-పూర్ణ చందర్, రామారెడ్డి-ఆనందరావు, నిజాంసాగర్-తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్-భాస్కర్ రెడ్డి, నస్రుల్లాబాద్-చందర్, బిబిపేట్-అశోక్, దోమకొండ-విజయ్ కుమార్, పాల్వంచ-జేతాలాల్, గాంధారి-శ్రీహరిని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.

News September 25, 2024

కామారెడ్డి: సీఎంఆర్ బియ్యం సరఫరా త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాజంపేటలోని శంకధార రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైసుమిల్లుకు కేటాయించిన వరి ధాన్యాన్ని తొందరగా సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు.

News September 24, 2024

NZB: శ్రీరాంసాగర్ UPDATE.. పెరిగిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఉ.9 గంటలకు 40 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లోగా 29,666 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.

News September 24, 2024

నవోదయ పాఠశాల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

image

నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు తేదీని అక్టోబర్ 7 తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. సెప్టెంబర్ 23తో గడువు ముగియనుండగా దాన్ని అక్టోబర్ 7 వరకు పెంచారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. https://navodaya.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

News September 24, 2024

ఉప రాష్ట్రపతిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

image

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న అర్వింద్ సోమవారం ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

News September 24, 2024

NZB: ఇంట్లో చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి

image

నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్‌లో గల సీఎం రోడ్ గల్లీ మదర్సా ప్రాంతంలోని వాజిద్ ఖాన్ ఇంట్లో నసీర్ అనే యువకుడు సోమవారం పట్టపగలు చోరీకి యత్నించాడు. అదే సమయంలో యజమాని పిల్లలతో సహా తిరిగి వచ్చారు. వారిని చూసిన దొంగ కత్తితో బెదిరించి పారిపోయేందుకు యత్నించాడు. కాగా అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.