India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నేడు బాన్సువాడ బంద్ కు పిలుపునిచ్చినట్లు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల ఆందోళన ముసుగులో హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బంద్కు విద్య, వ్యాపార సంస్థలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి 1గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
*నిజామాబాద్లో అంబరాన్నంటిన బంజారా తీజ్ ఉత్సవాలు
*NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
*రైల్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత
*షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్
*ఆర్మూర్: పిచ్చికుక్కల దాడి.. ఏడుగురికి గాయాలు
*భార్య కళ్ళ ముందే భర్త ఆత్మహత్య
*రుద్రూర్: నూతన గ్రామ పంచాయతీగా కొండాపూర్
*నిజాంసాగర్:చెరువులో పడి యువకుడు మృతి
నగరంలోని 4వ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆదివారం సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి 8 సెల్ ఫోన్లు, రూ.10,140 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
పారిస్ నుంచి తిరిగి వచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ తన తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్తో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్తో ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గ్రూప్-1 పోస్ట్తో పాటు తనకు కేటాయించిన 600 చదరపు గజాల స్థలం పట్ల ముఖ్యమంత్రికి, షబ్బీర్ అలీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు.
నిజామాబాద్లో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం బాసరలో లభ్యమైనట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్కు చెందిన కల్లెపల్లి రాజు(36) ఈ నెల 3న కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రాజు ఆచూకీ కోసం గాలించగా ఆదివారం బాసరలోని గోదావరి నదిలో శవమై కనిపించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
రైలులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక సంచులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆపరేషన్ సతర్క్లో భాగంగా నిజామాబాద్ RPF, GRP ప్రత్యేక బృందాలు 17057 నంబర్ ట్రైన్లో తనిఖీ చేయగా 3 నల్లబెల్లం సంచులు, 7 పటిక సంచులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిజామాబాద్ RPF పోలీస్ స్టేషన్కు తరలించారు. వాటి విలువ రూ.19,600 ఉంటుందని CI సుబ్బారెడ్డి తెలిపారు.
కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం.. మామిడి చిరంజీవులు తన భార్యతో కలిసి వరి పొలానికి మందు చల్లుతున్నారు. దాహం వేయడంతో బోరు మోటర్ వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్స్ పాడైంది. మరమ్మత్తుల నిమిత్తం నియంత్రిక హ్యాండిల్ను పట్టుకోగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. పంచాయతీల వారీగా.. సెప్టెంబర్, అక్టోబర్లోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ గత 6 నెలలుగా సర్పంచ్లు లేక అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి.
సిరిపూర్కి చెందిన తెండుసాగర్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగ లేక వాటర్ ప్లాంట్లో కూలీలుగా సాగర్ తన భార్య చందన పనిచేస్తున్నారు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఇద్దరు గొడవ పడేవారు. ఈ మధ్య వారికి గొడవ జరగడంతో చందన డ్యూటీకి నడుచుకుంటూ న్యాల్కల్ కెనాల్ వరకు వెళ్లగా,. భర్త బైక్పై కెనాల్ వరకు వచ్చి తన భార్య కళ్ళ ముందే కెనాల్లో దూకాడు. కెనాల్లో వెతకగా శవమై దొరికాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.