India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. స్థానిక మిర్చి కాంపౌండ్లోని ఓ ట్రాన్స్ పోర్ట్ షాపు వద్ద నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఆదివారం ఉదయం షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో 1 టౌన్ సీఐ రఘుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
కన్నతల్లే ముగ్గురు బిడ్డలను అమ్మేసిన ఘటన ఆర్మూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. SHO సత్యనారాయణ వివరాలు.. మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్యి భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. కాగా మొదటి భర్తకు పుట్టిన ఏడేళ్ల బాబు, ఇద్దరు మగ కవల పిల్లలను రూ.4లక్షలకు ముగ్గురు వ్యక్తులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు పిల్లలను కొన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్సై రాజు వివరాలిలా.. ఖంబాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మీనా (25) తన భర్త అయిన సాయిలుతో శుక్రవారం రాత్రి కుటుంబ సమస్యల విషయంలో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
బోధన్ మండలంలో ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను మోసం చేసిన యువకుడిని పోలీసులు శనివారం రిమాండ్ చేశారు. రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ.. బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్స్ స్ట్రా గ్రామ్ లో యువకుడికి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి NZB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయని పార్టీ నేతలంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?
ప్రేమ పేరుతో ఓ యువకుడు 17ఏళ్ల బాలికను మోసం చేసిన ఘటన బోధన్లో చోటుచేసుకుంది. రూరల్ SI మచ్చేందర్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో వినయ్(22)కి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమేను పెళ్లిచేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది.
ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చివరి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులలో వారం సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్ లలో క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి రేపు (శనివారం) సందర్శించనున్న నేపథ్యంలో ఆమె కౌలాస్ కోటను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే సద్బుద్ధి ప్రసాదించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంబెడ్కర్కు నివాళి అర్పించి వేడుకున్నారు. హైదరాబాద్లోని 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నివాళి అర్పించడానికి వీలు లేకుండా తమను హౌజ్ అరెస్ట్లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
Sorry, no posts matched your criteria.