Nizamabad

News August 11, 2024

MCR: రూ.67,700 డబ్బును పోగొట్టుకున్న నర్సింగ్ ఆఫీసర్..

image

సైబర్ మోసగాళ్ల చేతుల్లో మాచారెడ్డి మండలంలోని కాకుల గుట్ట తండాకు చెందిన ఓ నర్సింగ్ ఆఫీసర్ భూక్య సంతోష్ మోసపోయాడు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించి, లింక్ పంపి దాని ద్వారా వివరాలు తీసుకొని అతని అకౌంట్లోని రూ.67,700 డబ్బును దోచేశారు. వెంటనే సంతోష్ షాక్‌కు గురై, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి పోలీసులను కోరారు.

News August 11, 2024

NZB: ‘సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉంచుకోవాలి’

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.

News August 10, 2024

నిజామాబాద్: ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లి‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నిజాం కాలానికి చెందిన అన్వర్(42) ఆర్సపల్లి బైపాస్ నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్ళే మార్గ మధ్యంలో ఆగివున్న లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News August 10, 2024

NZB: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌పై జిల్లాలో విస్తృతంగా చర్చ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ఆమెకు బెయిల్ వస్తుందా? లేదా? అనే చర్చ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది. ఇదే కేసులో 2 రోజుల క్రితం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా తీహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.

News August 10, 2024

NZB: నరేందర్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

image

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్వో నరేందర్ ‌కు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం నరేందర్ ‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు శనివారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించగా నరేందర్ ‌ను జైలుకు తరలించారు.

News August 10, 2024

NZB: 465 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం, వ్యక్తి అరెస్ట్

image

ఎండు గంజాయిని సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టివిఎస్ వాహనంపై ఎండు గంజాయిని తీసుకుని వెళ్తున్న షేక్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 465 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో దిలీప్, ఎస్సై మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

అమన్ సెహ్రావత్‌కు NZB ఎంపీ అభినందనలు

image

పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ‘ట్విట్టర్ X’ వేదికగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పోస్టులో అమన్ సెహ్రావత్ జాతీయ జెండా పట్టుకున్న ఫోటోను జత చేసిన ఎంపీ అరవింద్ ‘భారత్ మరో ఘనతను చాటుకుంది. ఒలంపిక్స్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినందుకు అమన్ సెహ్రావత్‌కు అభినందనలు తెలిపారు.

News August 10, 2024

నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది నూతన గ్రామ పంచాయతీలు

image

పంచాయతీ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కోటగిరి మండలంలో కొత్తగా 8 పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి మండలంలో ఇప్పటి వరకు 28 పంచాయతీలుండగా ఆ సంఖ్య 36కు చేరింది. ఎత్తొండ క్యాంపు, ఎక్లాస్పూర్ క్యాంపు, శ్రీనివాస్ రెడ్డి కాలనీ, బాకర్ ఫారం, జల్లాపల్లి పాత గ్రామం, జల్లాపల్లి తండా, తిర్మలాపూర్, రాంగంగానగర్ కొత్తగా ఏర్పడ్డాయి.

News August 10, 2024

నిజామాబాద్: శిక్షణ ఇచ్చి కొలువులు

image

టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 75కి పైగా కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో 45వేల మంది వరకు తమ పేర్లను టాస్క్ వద్ద నమోదు చేసుకున్నారు. అందులో 5 వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. టాస్క్ ఆధ్వర్యంలో కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ ప్రాంగణ నియామాకాలు చేపడుతున్నట్లు టాస్క్ ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.

News August 10, 2024

నిజామాబాద్ జిల్లాకు 13 ఎలక్ట్రిక్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి RTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని పనులు మిలిగి ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి 11 ఛార్జింగ్ పాయింట్లు పూర్తయ్యాయి. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని అర్టీసీ అధికారులు ప్రకటించారు.