India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం పూర్తి కావడంతో నీటి విడుదల సోమవారం నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.
మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
నిజామాబాద్ నగరంలోని హైమద్పుర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి రెండు గ్రూపులు గ్యాంగ్ వార్కు దిగాయి. స్థానిక యువకులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది. సాజీద్ అనే వ్యక్తితోపాటు మరో యువకుడికి కత్తిపోట్లు తగిలాయి. ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గంజాయి తాగే అడ్డా విషయంలో ఈ గ్యాంగ్ వార్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR జిల్లా పెద్దకొడప్గల్ వాసి రామయ్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా నీళ్లు, చాయ్ తాగడానికి గ్లాసులు ఉపయోగిస్తారు. కానీ ఈయన మాత్రం భిన్నంగా కేవలం కొబ్బరిచిప్పనే వినియోగిస్తున్నారు. రోడ్డు పక్కన చాయ్ కొట్టుకు వెళ్లినా, అక్కడ కూడా తన వెంట తెచ్చుకున్న కొబ్బరి చిప్పలోనే చాయ్ తాగడం విశేషం. ఆధునిక యుగంలోనూ తమ ప్రత్యేక అలవాట్లను కొనసాగిస్తున్న ఈ పెద్దాయన ప్రత్యేక వ్యక్తిగా నిలుస్తున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15న ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు KMR జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ, సివిల్ సప్లై, తదితర శాఖలపై సమీక్షిస్తారు. అనంతరం ఆయన NZB జిల్లా ఆర్మూర్కు చేరుకొని, సన్నం బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేస్తారు. సా. 4 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. గుండ్ల చెరువుకు మిని ట్యాంక్ బండ్గా అభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు. న్యాయ సలహాదారుగా Rtd DSP మనోహర్ను ఎన్నుకున్నారు.
ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నందిపేట్కు చెందిన శ్రీను(48) ఆదివారం మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. మృతుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కమ్మర్పల్లి గురుకుల పాఠశాలలో చికెన్ సప్లై చేసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఉప్లూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు గాయాలవడంతో మృతి చెందాడు.
అమీర్పేట్లో ఆదివారం నిర్వహించిన బైసాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో జీవించే రాష్ట్రమన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామన్నారు.
సిక్కుల పవిత్ర బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాముల బస్తిలోని ఫతేపూర్ గురుద్వారా సాహెబ్లో గురుద్వారా కమిటీ సభ్యులు వివిధ భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోఖీ కమిటీ సభ్యులతో కలిసి బహూకరించారు.
Sorry, no posts matched your criteria.