Nizamabad

News December 7, 2024

NZB: పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్ లలో క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

News December 6, 2024

కౌలాస్‌కోటను సందర్శించిన సబ్ కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి రేపు (శనివారం) సందర్శించనున్న నేపథ్యంలో ఆమె కౌలాస్ కోటను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

News December 6, 2024

రేవంత్ ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలి: వేముల

image

ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే సద్బుద్ధి ప్రసాదించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంబెడ్కర్‌‌కు నివాళి అర్పించి  వేడుకున్నారు. హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నివాళి అర్పించడానికి వీలు లేకుండా తమను హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

News December 6, 2024

NZB: బాలికపై లైంగిక దాడి.. ఇద్దరి రిమాండ్

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని, అతడికి సహకరించిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి CI మల్లేశ్ తెలిపారు. అక్టోబర్ 1న జక్రాన్‌పల్లికి చెందిన యువకుడు ఓ బాలికను నమ్మించి నిర్మల్‌లోని వెంకటసాయి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 31న అజయ్‌ని అరెస్ట్ చేశారు. కాగా లాడ్జ్ మేనేజర్ సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.

News December 6, 2024

పిట్లం: ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా..! 

image

పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించవద్దని అధికారులు పదే పదే చెపుతున్నా..కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు పై చిత్రమే నిదర్శనం. ఇలా ప్రయాణించే పలువురు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేకం ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఓ తుఫాన్ టాప్‌పై ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృష్యామిది.

News December 6, 2024

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తాం:చైర్మన్

image

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డేడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వారి విజ్ఞాపనలు అందించారని తెలిపారు.

News December 4, 2024

నిజామాబాద్‌: మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా?

image

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ 3 సెకన్ల పాటు భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.

News December 4, 2024

పిట్లం: హైవే (161) కన్నీరు పెడుతోంది..! పట్టించుకోరా?

image

ప్రతిఒక్కరూ తమ ఊరికి మంచి రహదారి ఉండాలనుకోవడం సహజం. కానీ జుక్కల్ నియోజకవర్గ వాసులు హడలిపోతున్నారు. ఆ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హైవే అధికారుల నిర్లక్ష్యం, కొంత మేర వాహనదారుల నిర్లక్ష్యంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్లం వద్ద హైవే పై కారుకు గేదెలు అడ్డు రావడంతో కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.

News December 4, 2024

NZB: మెప్మా మహిళా సంఘాలకు భారీగా రుణాలు పంపిణీ

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అర్బన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. 128 స్వయం సహాయక సంఘాలకు రూ. 10.52 కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 మంది సభ్యులకు కోటి రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వీధి విక్రయదారులకు స్వనిధి పథకం కింద 50 మందికి రూ. 15 లక్షల ఆర్థిక తోడ్పాటు అందించారు.

News December 3, 2024

కామారెడ్డిలో ముగ్గుల పోటీలను పరిశీలించిన కలెక్టర్

image

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ, కమిషనర్ శ్రీహరిడిప్యూటీ ఈఈ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.