India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజాంబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను ఆయన తల్లి అంత్యక్రియల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన విషయంలో గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే గురువారం ఆయన దుబాయ్ నుంచి రాగానే అతని వద్ద ఉన్న పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బోధన్ మాజీ MLA షకీల్ను శంషాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె 2005 వరకు శక్కర్ నగర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. అంత్యక్రియలు శక్కర్ నగర్లో మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ ఛబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ ఛబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.
KMR జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు HYD నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈఘటలో అంజలి పూజ మృతి చెందింది. అంజలి పూజ టీయూ సౌత్ క్యాంపస్లో చదువుకుంటోంది.
ఇందల్వాయి మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు మృతి చెందాడు. గండితాండకు చెందిన విస్లావత్ నరేందర్ (43) రోజు మాదిరిగా తన పొలంలో ఉన్న గేదెలకు నీరు పట్టేందుకు సోమవారం రాత్రి వెళ్లాడు. అయితే పొలానికు వెళ్లే దారిలో గల చెరువులో ప్రమాదవశాత్తుపడి నీట మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మనోజ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
ఆర్టీసీలో పని చేస్తున్న 29 మంది ఉద్యోగులకు త్రైమాసిక ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. నిజామాబాద్-1 డిపోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ టీ.జోత్స్న చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువు లోగా, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
Sorry, no posts matched your criteria.