Nizamabad

News August 8, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా నిండని చెరువులు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే ఇప్పటివరకు వర్షాలు తక్కువగానే కురిశాయని అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు కుంటలు కలిపి 2,500 వరకు ఉండగా, 600 చెరువులలో 75% అంతకుమించి నీరు చేరాయి. మిగతా చెరువులు కుంటల్లో నీరు అంతగా చేరలేదు. కామారెడ్డిలో 141 చెరువుల్లో, నిజామాబాద్ జిల్లాలో 431 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పడుతున్నాయి. మిగతా చెరువులో నామమాత్రంగా నీరు చేరింది.

News August 8, 2024

NZB: బస్సులో రూ. 5లక్షలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

image

తూప్రాన్‌లో గత నెల 9న రాజధాని ఎక్స్‌ప్రెస్ రూ. 5 లక్షలు దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. మసాలాల వ్యాపారం చేసే నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో వెళ్తుండగా అతని వద్ద ఉన్న రూ. 5 లక్షలు చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన సూరజ్ డికోలే, సంతోశ్ డికోలే (39), అర్జున్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News August 8, 2024

కామారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్.. డబ్బులు పంపాలని మెసేజ్

image

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్‌ప్లే పిక్చర్ వినియోగిస్తూ డబ్బులు పంపాలని కలెక్టరేట్‌ ఏటీఓకు మెసేజ్ చేశారు. కలెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మసూర్.. కలెక్టర్ పేరిట దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 8, 2024

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న జ్వరాల కేసులు

image

వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా జిల్లా వాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీగా ఓపీ పెరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,62,122 ఇళ్లల్లో 6,21,890 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 3,885 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. వానాకాలం నుంచి 38 రోజుల్లో 89 డెంగ్యూ కేసులు వచ్చాయి.

News August 8, 2024

నాగిరెడ్డిపేట: అనుమతి లేకుండానే పోచారం ప్రాజెక్టు కట్ట తొలగింపు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ కట్టను నేషనల్ హైవే అధికారులు నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే తొలగించారని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నేషనల్ హైవే అలైన్‌మెంట్‌ లేని భూమి వద్ద ఉన్న 100 ఏళ్ల చెట్టును సైతం నరికి వేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఆయన నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు కట్టను తొలగించడం ద్వారా నీటి నిల్వకు తీవ్ర నష్టం అన్నారు.

News August 7, 2024

నిజామాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష

image

మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వి.వెంకట నారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మంది పట్టుబడగా వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 34 మందికి రూ.89 వేలు జరిమానా విధించారన్నారు. ముగ్గురికి జైలు శిక్ష విధించారని చెప్పారు.

News August 7, 2024

కామారెడ్డి: ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

విద్యాసంస్థలలో ఇతర ప్రాంతాల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, విద్యాలయాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫ్రెషర్స్ పార్టీ అని కొత్తగా వచ్చిన విద్యార్థులను, సీనియర్ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బెదిరించడం, భయబ్రాంతులకు గురిచేయడం లాంటివి గతములో జరిగేవని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

News August 7, 2024

NZB: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, బిర్కూర్ మండలంలోని బొమ్మనిదేవ్ పల్లి గ్రామానికి చెందిన జింక శ్రీకాంత్(36) భార్య పిల్లలు. పెయింటింగ్ పనులు చేసుకుంటారు. గత మూడు సంవత్సరాల నుంచి నిజామాబాద్ నగరంలోని జెండాగల్లి‌లో నివసిస్తున్నారని తెలిపారు.

News August 7, 2024

బిక్కనూరు: కరెంటు షాక్‌తో యువ రైతు మృతి

image

కరెంట్ షాక్‌తో ఒక యువరైతు మృతి చెందాడు. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన స్వామి రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద స్టార్టర్ డబ్బాలో విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా విద్యుత్ షాక్ కలిగి అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ సాయికుమార్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.

News August 7, 2024

కోటగిరి: రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

image

కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి, 270క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. నెల రోజుల క్రితం ఈ రైస్ మిల్లుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.