Nizamabad

News March 9, 2025

NZB: కాంగ్రెస్ వల్లే నవోదయ విద్యాలయం వెనక్కి వెళ్లింది:MP

image

కాంగ్రెస్ వల్లే నవోదయ విద్యాలయం వెనక్కి వెళ్లిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం సమ్మతించించగా రూరల్ నియోజకవర్గంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం కూడా చూపించారన్నారు. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ విద్యాలయాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.

News March 8, 2025

మాక్లూర్: ముగ్గురిపై కత్తులతో దాడి

image

మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ తండాలో దారుణం జరిగింది. రేషన్ బియ్యం విషయంలో జరిగిన వాగ్వాదంలో ముగ్గురు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశారు. జ్యోతిరామ్ అనే వ్యక్తి భార్య గ్రామంలో రేషన్ డీలర్‌గా ఉన్నారు. అయితే తమకు బియ్యం ఇవ్వడం లేదని అన్నదమ్ముళ్లు విక్రమ్, పీర్ సింగ్ గొడవపడ్డారు. అక్కడే ఉన్న జ్యోతిరామ్‌తో పాటు ఆయన సోదరులు శ్రీనివాస్, రాజునాయక్ అడ్డుకోగా ఆగ్రహంతో విక్రమ్‌ఆ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు.

News March 8, 2025

NZB: అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది: కవిత

image

ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.

News March 8, 2025

NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

image

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 8, 2025

NZB: ఎంపీ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కాంగ్రెస్ నాయకులు

image

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను జిల్లా నాయకుడు ఉమ్మాజీ నరేశ్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ అభివృద్ధి చెందిందంటే సుదర్శన్ రెడ్డి వాళ్లనే అని పేర్కొన్నారు. భూపతి రెడ్డి ఉద్యమ నాయకుడు అని వారు ఉద్యమం చేసినప్పుడు అరవింద్ రాజకీయాల్లో లేరని గుర్తు చేశారు. 

News March 7, 2025

నిజామాబాద్ CPగా సాయి చైతన్య 

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పి. సాయి చైతన్య నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసిన సీపీ కల్మేశ్వర్ 5 నెలల క్రితం హైదరాబాద్లో ట్రెయినింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఇన్ ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 7, 2025

రాష్ట్రంలోనే టాప్ నిజామాబాద్ జిల్లా

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గురువారం జిల్లాలోని మంచిప్పలో 40.8℃, తూంపల్లిలో 40.7℃ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలు రాష్ట్రంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News March 7, 2025

కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్‌ మధ్య నడిచే (77601/77602) డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 7, 2025

NZB: పెళ్లిలో గొడవ.. వ్యక్తి మృతి

image

పెళ్లిలో గొడవ జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. ఎల్లారెడ్డికి చెందిన రాములు(42) ముగ్దంపూర్ గ్రామంలో చుట్టాల ఇంటికి పెళ్ళికి వెళ్లాడు. పెళ్లి కూతురును తీసుకురావడానికి పంపకపోవడంతో గొడవ జరిగింది. మద్యం తాగి ఉన్న రాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2025

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లగుట్ట తండా దర్గా వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ SHO ఆరీఫ్ తెలిపారు. దర్గా దగ్గర ఎలక్ట్రిక్ పోల్స్ పక్కన పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. 40-5౦ వయస్సున్న ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.