India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.
సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణి మమత ఎన్నికైనట్లు అధ్యాపకులు తెలిపారు. ఇటీవల జింఖానా గ్రౌండ్స్లో నిర్వహించిన సీనియర్ నేషనల్ హాకీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి హాకీ పోటీలు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పలువురు అభినందించారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమం తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్న నేపథ్యంలో అధికారులు వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈనెల 8 వరకు ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.
రంజాన్ పవిత్రమాసం ఆదివారం నుండి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ఇందుకోసం నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రంజాన్లో సహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారని, రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారని, ‘తరావీహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారని ముస్లిం మత పెద్దలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించి ఎయిర్ పోర్టు స్థలాన్ని పరిశీలించిన తెలిసిందే.
ఉమ్మడి NZB, KNR, MDK, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ వద్ద శనివారం రాత్రి లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయయ్యాయి. క్షతగాత్రులు నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లి తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివరాత్రి రోజు గంగస్థాన్ ఫేజ్-2, ఆర్టీసీ కాలనీ, ఏకశిలా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఇళ్లలో చోరీల విషయంలో దర్యాప్తు చేయగా సయ్యద్ హమీద్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిపై 85కు పైగా కేసులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సైక్లిస్టు బృందం ఖరారైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో జిల్లా స్థాయిలో వివిధ వయోపరిమితిలో ఎంపికల ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన జిల్లా బృందం ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
Sorry, no posts matched your criteria.