India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నల్లోల్ల రవి (46) అనే వ్యక్తి తన ఇంటి ముందున్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా, కాసేపటి తర్వాత గమనించిన సోదరుడు చూసేసరికి రవి మృతి చెందాడు. మృతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

14 ఏళ్ల బాలికలందరికీ HPV టీకా ఇప్పించాలని NZB DMHO రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకాలు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. 7 మార్చి 2011 నుంచి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఈ టీకా ఇప్పించాలన్నారు.

ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. NZB కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో CP పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. టౌన్ CI శ్రీనివాస్ రాజ్ పాల్గొన్నారు.

ఇంటర్ 2వ సంవత్సరం మ్యాథ్స్-2బీ, జూవాలోజి, హిస్టరీ, ఒకేషనల్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. 98 శాతం విద్యార్థులు హాజరయ్యారని NZB జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 14,761 మంది విద్యార్థులకు గాను 14,472 మంది హాజరయ్యారన్నారు. 289 విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని చెప్పారు.

టీయూ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో మార్చి 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ అతిక్ సుల్తాన్ గోరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు. ఏఐ సాంకేతికత ప్రాముఖ్యత, సవాళ్లు, పరిష్కారాలపై చర్చించనున్నారు.

భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 259వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో కష్టపడి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న వర్షిత్ రెడ్డిని గ్రామస్థులు, యువత అభినందించారు. జిల్లాకే గర్వకారణంగా నిలిచారన్నారు. తన ప్రతిభతో గ్రామానికి పేరు తెచ్చిన వర్షిత్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు గ్రామస్థులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.

నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ కమ్మ సంఘంలో శుక్రవారం బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారు నిరుత్సాహపడవద్దని, అది విజయానికి నాంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.
Sorry, no posts matched your criteria.