India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందినట్లు నిజామాబాదు పట్టణంలోని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి మద్యం మత్తులో న్యాల్కల్ రోడ్డు ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి చెందారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) ఓ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి న్యాల్ కల్కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు వెళ్లాడు. మద్యం మత్తులో కింద పడిపోవడంతో మృతి చెందాడు. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తోందన్నారు. మహిళాశక్తి కార్యక్రమం కింద క్యాంటీన్ల ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను పెండింగ్, రెగ్యులర్ బిల్లులు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా సిసిహెచ్ల గౌరవ వేతనం రూ.2వేలకు గాను రూ.1,31,24,000 బడ్జెట్ను మండలాల వారీగా విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు సీసీహెచ్ల గౌరవవేతనాన్ని విడుదల చేయాలని ఆదేశించామన్నారు.
కామారెడ్డి కళాభారతిలో ప్రజా విజయోత్సవాలు ప్రజాపాలన కళాయాత్ర ప్రగతి రథాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కళాకారులు ఆటపాట నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీపీఆర్ఓ, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ అధ్యక్షతన కామారెడ్డి కోర్టులో స్టెనో/టైపిస్ట్-1, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్-1,రికార్డ్ అసిస్టెంట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ సందర్శించాలన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఆటో డ్రైవర్ రసూల్ చేతిలో గాయాలపాలైన మేయర్ భర్త దండు శేఖర్ కోలుకుంటున్నారు. ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతున్నాడు. సుత్తి తో దాడి చేయడంతో కణితి భాగంలో తీవ్ర గాయం కాగా, వైద్యులు శస్త్ర చికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో కుల గణన పై పాట సిడిని సోమవారం సాయత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు రుద్రాంగి రమేష్ మేరు కుల గణన పై ప్రత్యేకంగా పాట రచించారు. కులగణన సర్వే భవిష్యత్తులో దేశం మొత్తం రోల్ మోడల్గా తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేరు సంగం నాయకులు వెంకటేష్, కీర్తి రాజ్ గోపాల్ పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా చందూరు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన రైతులు, పశువుల కాపర్లు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాయంత్రం లోపే పనులు ముగించుకొని జాగ్రత్త పడాలని రేంజ్ ఆఫీసర్ గంగాధర్ సూచించారు.
పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ చికోటి మనోజ్, కృష్ణారెడ్డి కోరారు.
Sorry, no posts matched your criteria.