Nizamabad

News August 5, 2024

సిరికొండ: టీచర్‌పై సస్పెన్షన్ వేటు

image

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం బోధించే టీచర్‌ పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పద్మజ సిరికొండ మండలంలోని కొండూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయులు మాత్రం కొండూరులో జాయిన్ కాలేదు.

News August 5, 2024

వనమహోత్సవంలో చెట్లు నాటిన కామారెడ్డి కలెక్టర్, ఎమ్మెల్యే

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు లక్ష్మీకాంతంతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులు మందు నిల్వ గది పరిశీలించారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

News August 5, 2024

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి: కామారెడ్డి కలెక్టర్

image

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జుక్కల్ మండలంలో బస్వాపూర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఏ విధంగా చెబుతున్నారని అర తీసి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు. కష్టపడి చదువుకుని మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు.

News August 5, 2024

కామారెడ్డి: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం గ్రామస్థులకు కనిపించింది. వ్యవసాయ బావుల వద్ద మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో పలు గ్రామాలకు సమాచారం అందించారు.

News August 5, 2024

కామారెడ్డి: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డి గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 44 నంబర్ జాతీయ రహదారిపై యువకుడు(30) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఎస్సై రంజిత్ వివరాల ప్రకారం.. సదాశివనగర్ వైపు నుంచి కామారెడ్డి వైపు యువకుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు.

News August 5, 2024

నిజామాబాద్‌ జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

image

ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా.. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని 2-వ టౌన్ పరిధిలోని ITI కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లో వాళ్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 5, 2024

నిజామాబాద్: రక్తం మరిగిన కుక్కలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి కుక్కలు రోడ్డుపై తిరుగుతుండటంతో ఒంటరిగా కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44పై కుక్కటు గుంపులు గుంపులుగా సంచారిస్తుడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు.

News August 5, 2024

నేటితో రైతుబీమా దరఖాస్తులకు గడువు ముగింపు

image

గాంధారి: రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగుస్తుందని మండల వ్యవసాయాధికారి నరేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 28వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులతో పాటు ఇప్పటివరకు బీమా కోసం దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 5, 2024

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టుల UPDATE

image

జిల్లాలోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1,389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.80 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం 416.400 మీటర్లుగా ఉంది.

News August 4, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సిబ్బందిపై DEO ఫైర్ * రామారెడ్డి: రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం * KMR: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ మాత్రమే: జిల్లా కలెక్టర్ * పార్టీకి విధేయులుగా ఉన్నవారే నా రాజకీయ వారసులు: జుక్కల్ MLA * ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని శిక్షించాలి.. CP ను కోరిన షబ్బీర్ అలీ * నిజామాబాద్‌లో వివాహిత సూసైడ్.